టాలీవుడ్ లో మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన హీరో ఎవరు అయినా ఉన్నారు అంటే అది మహేష్ బాబు మాత్రమే. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఏ సినిమా చేసినా సరే అతను ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ కోణం లోనే ఆలోచన చేయడం గమనార్హం. యువ హీరోలు కూడా ఇప్పుడు మహేష్ బాబు ని చూసి కొత్తగా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాలు ఎక్కువగా కమర్షియల్ గా ఉన్న నేపధ్యంలో అతని సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ప్రస్తుతం మన తెలుగులో మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొందరు నిర్మాతలు సినిమాలను చెయ్యాలి అని భావిస్తున్నారు. యువ హీరోలతో కలిసి మహేష్ బాబు సినిమాలను చెయ్యాలని ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే అతను నానీ తో ఒక సినిమా చేయడానికి గానూ చర్చలు జరుపుతున్నాడు. నానీ తో అతను సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. నానీ తో కలిసి ఒక సినిమా చేయడానికి గానూ అతన కొందరు నిర్మాతలను అడిగినా వాళ్ళు ముందు ముందుకి రాలేదు. 

 

దీనితో మహేష్ బాబు ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు. ప్రస్తుతం అతను చేస్తున్న పరుశురాం సినిమాలో నానీ ని తీసుకునే ఆలోచన లో ఉన్నాడని అంటున్నారు. నానీ తో సినిమా చేసే అవకాశాన్ని ఈ విధంగా తీసుకోవాలి అని మహేష్ బాబు భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే చర్చలను కూడా పూర్తి చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందు కి తీసుకుని వచ్చే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: