నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇదే ఊపుతో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పుష్ప లో నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి సేం కాంబినేషన్ రిపీటవుతుండటం తో పుష్ప సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 

 

ఇక మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో నిర్మిస్తున్నారు. దాదాపు 60 శాతం సినిమా షూటింగ్ ఫారెస్ట్ లోనే నిర్వహించనున్నారు. మరోసారి రంగస్థలం లాంటి నేచురల్ సబ్జెక్ట్ తో సుకుమార్ ఈ సినిమాని తెరమీద ఆవిష్కరించబోతున్నాడు. అంతేకాదు రంగస్థలం సినిమాతో రాం చరణ్, సమంత లకి ఎలాంటి క్రేజ్ వచ్చిందో అంతటి క్రేజ్ అల్లు అర్జున్, రష్మిక మందన్న లకి వచ్చేలా పాత్రలని తీర్చి దిద్దాడట సుకుమార్. అంతేకాదు ఇప్పటి వరకు రష్మిక మందన్నకి రానటువంటి క్రేజ్ ఈ సినిమాతో వస్తుందట.

 

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని.. ఆమే అల్లు అర్జున్ కి లవర్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. వాళ్ళలో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ అని, పూజా హెగ్డే, కియారా అద్వాని, మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ...ఇలా రక రకాల పేర్లు తెరమీదకొచ్చాయి. కాని తాజాగా ఈ విషయంలో క్లారిటి ఇచ్చారట మేకర్స్. ఇందులో ఒక్క రష్మిక మందన్న తప్ప మరో హీరోయిన్ కి స్థానం లేదని తాజాగా అందిన సమాచారం. ఈ సినిమాలో రష్మిక దే ప్రధాన పాత్ర అని సెకెండ్ హీరోయిన్ అన్న థాట్ లేదని లేటెస్ట్ న్యూస్.

 

ఇక ఈ సినిమాని లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. గత సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో మ్యాజిక్ ని మళ్ళీ రిపీట్ చేయాలని అనుకుంటున్నారట సుకుమార్, అల్లు అర్జున్.    

మరింత సమాచారం తెలుసుకోండి: