టాలీవుడ్ లో ఒకప్పుడు జంద్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ తర్వాత ఆ స్థానం భర్తీ చేస్తున్నారు అనీల్ రావిపూడి.  తీసిన ప్రతి సినిమా హిట్.. అంతేకాదు కడుపుబ్బా నవ్వించే కామెడీ. కళ్యాన్ రామ్ తో పటాస్ తో మొదలు పెట్టిన మనోడి కామెడీ జర్నీ  సుప్రీమ్, ఎఫ్ 2  ఈ ఏడాది మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు లాంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు.  మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ మనోడితో మరోసారి సినిమా తీయడానికి ఒప్పుకున్నారంటే అనీల్ రావిపూడి టాలెంట్ ఏంటో చెప్పొచ్చు.  అంతే కాదు మనోడు మెగాస్టార్ తో కూడా టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ చేయబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 

 

తాజాగా తెరపై మరో కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాతో నిరాశలో ఉన్న బాలయ్య ఆ మద్య రూలర్ మూవీతో మరో ఫ్లాప్ అందుకున్నాడు.  ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే మూవీస్ పై దృష్టి పెట్టారు.  ఈ నేపథ్యంలో గతంలో తనకు సింహా, లెజెండ్ లాంటి్ బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటితో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తేయగానే ఆయన బోయపాటితో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నారు. ఆ తరువాత సినిమాను బి.గోపాల్ తో చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

 

ఈ నేపథ్యంలోనే ఆయన అనిల్ రావిపూడి కథను కూడా విన్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడు.  అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బిజీలో ఉన్నారు బాలయ్య. మళ్లీ ఇటీవల బాలకృష్ణను కలిసి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. బాలకృష్ణకి కథ నచ్చిందని అంటున్నారు. అంతా ఓకే అయితే... బాలయ్యకు మరో మంచి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతుందని ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: