సమంత అక్కినేని తెలుగులో ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ రేంజ్‌లో ఉంది.  'ఏమాయ చేశావేస చిత్రంతో ఇండ‌స్ట్రీకి ప‌రిచయమైన ఈ భామ త‌న న‌ట‌నా ప్ర‌తిభ‌తో  కుర్రకారుని ఆకట్టుకుంది. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా ఒక వెలుగు వెలుగుతోంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ మంచి చిత్రం మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. అలా ఈ భామ గ‌త ఏడాది అంతా సమంత అదరగొట్టింద‌నే చెప్పాలి. ఈ సంవత్సరంలో సమంత మొదటి సినిమా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పొచ్చు. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేక‌పోయింది.  ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. 

ఇక ఇదిలా ఉంటే... స‌మంత ఏమాయ చేశావే సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే వాళ్ళ నాన్న‌గారికి సీరియ‌స్ అయి హాస్ప‌ట‌ల్‌లో ఎడ్మిట్ అయ్యారు. కానీ స‌మంత మాత్రం చూడ‌టానికి వెళ్ళ‌లేని ప‌రిస్థితి. త‌ర్వాత చూడ‌టానికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న‌గారికి చాలా సీరియ‌స్‌గా ఉన్నా షూటింగ్ స‌మ‌యంలో మాత్రం ఎప్పుడూ కూడా ఆ బాధ‌ను తెలియ‌కుండా న‌టించింది స‌మంత‌. ఇక ఏమాయ‌చేశావే సినిమా అవ్వ‌క‌ముందే దిల్‌రాజు బృందావ‌నంలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. స‌మంత త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను మాయ చేసింద‌నే చెప్పాలి. ఒక ఈ చిత్రాన్ని మంజుల నిర్మించారు. ఈ సినిమా స‌మ‌యంలోనే మ‌హేష్‌బాబుతో న‌టించే అవ‌కాశం ఇస్తాను చేస్తావా అని అన్నార‌ట‌. త‌ప్ప‌కుండా చేస్తాన‌ని స‌మంత అన్నార‌ట‌. దాంతో మ‌హేష్ ఖ‌లేజా సినిమా అవ్వ‌గానే దూకుడు చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా పెట్టుకోమ‌ని మంజ‌ల సిపార్స్ చేయ‌గా స‌మంత‌కు ఆ ఛాన్స్ వ‌చ్చింది. ఒక త‌మిళంలో మ‌ణిర‌త్నం సినిమాలో గౌత‌మ్ కార్తీక్ డెబ్యూట్ మూవీ సినిమాలోనూ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ఐ సినిమాలోనూ న‌టించే అవ‌కాశం ద‌క్కింది. కానీ అదే స‌మ‌యంలో స‌మంత‌కి స్కిన్ ప్రాబ్ల‌మ్ రావ‌డంతో దాదాపురెండు నెల‌లు రెస్ట్ తీసుకోవ‌ల‌సి వ‌చ్చింది దాంతో ఆ రెండు సినిమాల్లోనూ న‌టించే అవ‌కాశాన్ని పోగొట్టుకుంది స‌మంత‌. ఆ రెండూ మిస్ అయినందుకు స‌మంత చాలా బాధ‌ప‌డింది. ఇక అవి మిస్స‌య్యాక రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈగ చిత్రంలో న‌టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: