జెనీలియా... ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా మన పక్కింట్లో ఉండే అమ్మాయిలాగా సహజ నటనతో నటించి అందరితో శభాష్ అనిపించుకుంది. ఇక జెనీలియా హీరోయిన్ గా తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసింది. అయితే అక్కడ 2012 సంవత్సరంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇక అంతే ఆ తర్వాత జెనీలియా వెండితెరకు దూరం అయింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం జెనీలియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇన్ని రోజులు జెనీలియా పూర్తిగా తన తల్లి పాత్రను పోషించింది. అయితే త్వరలో తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు జెనీలియా సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
View this post on InstagramThis is your sunday reminder that you can handle whatever the week throws at you😎
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... కుర్రకారుతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా చాలా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. తెలుగులో ఆమె రెడీ, బొమ్మరిల్లు లాంటి చాలా విజయవంతమైన చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అయితే పెళ్ళికి ముందు జెనీలియా తెలుగులో చివరిసారిగా నటించిన చిత్రం " నా ఇష్టం ". ఇక వివాహం తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉండి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తన కెరీర్ ని తిరిగి ప్రారంభించాలని జెనీలియా భావిస్తోంది. అయితే తనకు సరిపడే మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు జెనీలియా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
అయితే ఈ మధ్యకాలంలో ఒకసారి ఒక ఫోటో షూట్ ని చేసి అందరి మతి పోగొట్టింది.జెనీలియా ఇద్దరు పిల్లల తల్లి అయినా తన గ్లామర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె రీ ఎంట్రీ సినిమా తెలుగులోనా లేక హిందీలోనా ఉంటుందని ఎదురు చూడాల్సిన విషయమే.