ఆ దర్శకుడు చేసింది ఒక్క సినిమానే అయినా పది సినిమాలు చేసినంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టినా ఇప్పటికీ మరో సినిమా మొదలుపెట్టలేదు. అయితే ఇప్పుడు మొదటి సినిమాకే సీక్వెల్ చేస్తానంటున్నాడు. 


రెండేళ్ల కిందట రిలీజైన ఆర్ ఎక్స్ 100 సెన్సేషన్ సక్సెస్ గా నిలిచింది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ తో పాటు యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన కార్తికేయకు ఓవర్ నైట్ లో క్రేజ్ వచ్చింది. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ గ్లామర్ బ్యూటీగా వెలిగింది. పలు సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి టాలీవుడ్ పై తనదైన ముద్రవేశాడు. ఇప్పుడు ఈ దర్శకుడు ఇదే సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడట. 

 

ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత దర్శకుడు అజయ్ భూపతికి అనేక ఆఫర్లు వచ్చాయి. మరి ఇన్ సైడ్ లో ఏమైందో ఏమోగానీ ఇప్పటి వరకు ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాను పట్టాలెక్కించలేదు. మహాసముద్రం అనే టైటిల్ తో రెండో సినిమా చేయబోతున్నాడని ఏడాదిగా వినిపిస్తున్నా.. ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం లేవు. ఈ క్రమంలో ఆర్ఎక్స్ 100 మూవీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి సోషల్ మీడియాలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించాడు. 

 

ఆర్ఎక్స్ హండ్రెడ్ కు ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెబుతున్నాడు. సీక్వెల్ లో కూడా కార్తికేయనే హీరోగా నటిస్తాడని క్లారిటీ ఇచ్చాడు. అయితే స్టోరీ ఏ లైన్ అనుకోలేదన్న అజయ్ భూపతి తప్పకుండా సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను మహా సముద్రం ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాడట. కొన్ని కారణాల వల్ల మహా సముద్రం ఆలస్యమవుతోందని త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతోందని అసలు విషయం చెప్పాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: