ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ల్ల దారుణంగా ట్రోల్ అయిన ఓ హీరోయిన్ ఇప్పుడు మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. ఓ సారి 2018 ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్తే.. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జూనియర్ హీరోయిన్ అలేఖ్య ఏంజెల్ సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె న‌టించిన ఓ సినిమాకు సంబంధించిన ఫంక్ష‌న్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల్గొన‌డంతో జ‌గ‌న్‌తో ఆమె సెల్ఫీ దిగింది. అంత‌కు మించి ఆమెకు, జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం కూడా లేదు.

 

అయితే ఈ ఫొటోను అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాన్ ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేశారు. దీనిపై అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డిచాయి. దీనిపై అలేఖ్య స్పందిస్తూ త‌న‌కు జ‌గ‌న్ గారితో ప‌రిచ‌యం లేదని తన లైఫ్‌లో ఫస్ట్ టైం కలిశా.. నా సినిమా ఆడియో సీడీని ఆయన రిలీజ్ చేసిన సందర్భంగా సెల్ఫీ దిగా అని ఆ ఫొటోని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారని ఊహించలేదంటూ వాపోయింది. ఇక అలేఖ్య స్వ‌స్థ‌లం తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట‌. ఫ్యాష‌న్ డిజైనింగ్ కోర్సు చేసిన ఆమె ‘ఎదరలో చెరగని గురుతులు’  సినిమాతో రంగ ప్ర‌వేశం చేసింది.

 

చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. అనంతరం ‘అక్కడొక్కడుంటాడు’ సినిమాలో కూడా నటించింది. ఇక ఆమెలో మ‌రో కోణం కూడా ఉంది. హ్యుమానిటీ హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేసిన ఆమె ఇప్ప‌టికే లాక్ డౌన్ నేప‌థ్యంలో 8 వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు భోజ‌నం పెట్టింది. తాజాగా మ‌రో 500 మందికి కూడా అన్న‌దానం చేసింది. ఎంతోమంది పెద్ద హీరోయిన్లు సైతం విరాళాలు ఇచ్చేందుకు వెన‌కా ముందు ఆలోచిస్తుంటే ఈ చిన్న హీరోయిన్ మాత్రం ఎంతో పెద్ద మ‌న‌స్సుతో చేస్తోన్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌తి ఒక్క‌రు అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: