టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ లో 'బృందావనం' మూవీ ఒకటి. ఈ మూవీలో మూవీలో కాజల్, సమంతలు హీరోయిన్లుగా నటించారు. ప్రకాశ్ రాజ్, శ్రీహరి అన్నదమ్ములుగా నటించారు. తన ప్రేయసికి ఇచ్చిన మాట కోసం విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను కలిపి ఆ ఇంటిని బృందావనంగా మారుస్తాడు హీరో. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్ మెంట్ ఉంది. ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా చెప్పొచ్చు. ఈ తరహా సినిమాల్లో మళ్లీ ఎన్టీఆర్ నటించలేదు. గత ఏడాది మహేష్ బాబు తో ‘మహర్షి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన వంశి పైడిపల్లి తాజాగా ‘బృందావనం’ సీక్వెల్ పై దృష్టి పెట్టినట్టు టాలీవుడ్ లో గుస గుస వినిపిస్తుంది.
తెలుగులో కథాకథనాలపై మంచి పట్టు వున్న దర్శకుల జాబితాలో వంశీ పైడిపల్లి ఒకరుగా కనిపిస్తాడు. మహేశ్ బాబుకి 'మహర్షి' వంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి, ఆయనతోనే మరో ప్రాజెక్టును ప్లాన్ చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ కథ పట్టాలెక్కలేదు. కథలో మంచి బలం లేదని.. స్క్రిప్ట్ మరికాస్త బెటర్ ఉండాలని మహేష్ బాబు చెప్పడంతో ఆ పనిలో ఉన్నారట వంశిపైడిపల్లి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ తో 'బృందావనం' సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు.
2010లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'బృందావనం' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను వంశీ పైడిపల్లి సిద్ధం చేయడం కూడా జరిగిపోయిందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఎన్టీఆర్ కి ఆ కథను వినిపించనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక ఓకే అయితే త్రివిక్రమ్ మూవీ తర్వాత వంశి పైడిపల్లితో మరో ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఉండబోతున్నట్లే లెక్క. కాకపోతే ఇది అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఏం చెప్పలేం.