నాగశౌర్య సరసన చలో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మిక మందాన ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లో అగ్రతారగా ఎదిగింది. మహేష్ బాబు, నితిన్ లాంటి బడా హీరోల సరసన ఇప్పటికే నటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించే ఆఫర్ ని కూడా దక్కించుకుంది. అయితే ప్రస్తుతం తన ఇంటికే పరిమితమైన రష్మిక తన ఖాళీ సమయంలో అభిమానుల తో మాట్లాడి వారిని బాగా అలరిస్తుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో విచ్చేసి తన అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది.


లాక్ డౌన్ ఎత్తేసిన మరుక్షణమే మీరు ఏమి చేస్తారు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా... తాను తన స్నేహితులను కలవడానికి ఆగమేఘాల మీద వెళ్తానని చెప్పింది. పుష్పా సినిమా కోసం మీరు ప్రత్యేకమైన యాస నేర్చుకుంటున్నారా కదా అని అడిగితే... అవును అదే నీకు ఎలా తెలుసు? అంటూ ఆశ్చర్యపోయింది రష్మిక. ఈ క్రమంలోనే ఒక కొంటె నెటిజెన్... 'ఆ భగవంతుడు నాకు ఏదైనా వరం కోరుకోమని అడిగితే... మీకు భర్త కావాలని కోరుకుంటా' అంటూ మెసేజ్ చేసాడు. దానికి రష్మిక స్పందిస్తూ... 'ప్లీజ్ మా కుక్క అనుమతి తీసుకోండి' అంటూ తన కుక్క ఫోటోని అప్లోడ్ చేసి ఆశ్చర్యపరిచింది.


ఇంకా చాలా మంది నెటిజన్లు ఆమెను అనేక ప్రశ్నలు వేశారు. మీడియా వాళ్ళ ద్వారా మీ ఇంటిని అంతా చూపించమని ఒక నెటిజన్ కోరగా... లేదు నేను చూపించను. ఇది నా వ్యక్తిగత ప్రదేశం అంటూ ఆమె సమాధానమిచ్చింది. మీరు యాక్టర్ కాకపోతే ఇప్పుడు ఏం చేస్తూ ఉండేవారు అని ఆమెను ప్రశ్నించగా... బహుశా జీవితాంతం ఇంటిలోనే నిర్బంధం అయ్యి ఉండేదాన్ని ఏమో అని ఆన్సర్ చేసింది. దిల్ వాలే చిత్రంలో కాజల్ షారుఖ్ ఖాన్ ల వలె నాతో మీరు కూడా డేటింగ్ కి వస్తారా అని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే... ఆః, ఆలోచిద్దాం లే అంటూ సున్నితంగా నిరాకరణ వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: