సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరో విజయ్ దేవరకొండ కి విపరీతమైన పాపులారిటి వచ్చింది. చెప్పాలంటే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలానే ఉంది. అదే క్రేజ్ దర్శకుడు సందీప్ రెడ్డికి ఉంది. అందుకే బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఇక ఈ సినిమాతో విజయ్ కి అయితే ఏకంగా రౌడి హీరో అన్న పేరు కూడా వచ్చింది. అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లోనే కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లోను విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అందుకే విజయ్ కి బాలీవుడ్ లోను విపరీతమైన క్రేజ్ ఉంది.

 

ఇక సందీప్ రెడ్డి కి టాలీవుడ్ లో అయితే ఒక్క సినిమా చేతిలో లేనప్పటికి బాలీవుడ్ లో మాత్రం ఒక సినిమా చేస్తున్నాడు. అయితే ఎటు తిరిగి అవకాశాలు రానిది హీరోయిన్ శాలిని పాండే కే. అర్జున్ రెడ్డి సినిమాకి సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ ఎంతగా కష్ట పడ్డారో శాలిని కూడా అంతగా కష్టపడింది. బోల్డ్ సీన్స్ లో నటించింది. దర్శకుడు చెప్పినట్టు లిప్ లాక్స్ కూడా ఇచ్చింది. కాని ఆ సినిమా తర్వాత మాత్రం శాలిని కి ఆశించినతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. 

 

సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రాం తో 118 సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా శాలిని కి మంచి పేరే తెచ్చిపెట్టింది. కాని వరసగా మాత్రం ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో నటించిన ఇద్దరి లోకం ఒక్కటే సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం తను చేస్తున్న సినిమా ఒక్క నిశబ్ధం మాత్రమే. ఈ సినిమా హిట్టయినా శాలిని కి ఎంత పేరు వస్తుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ అనుష్క. హీరో మాధవన్. వీళ్ళతో పాటు అంజలి, హాలీవుడ్ నటుడు ఉన్నారు. ఇంతమందిలో శాలినికి ఎంత పేరు వస్తుందో చెప్పడం కష్టమే. అయితే శాలిని మాత్రం అర్జున్ రెడ్డి సినిమా తర్వాత దర్శకుడు, హీరో బాగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. వాళ్ళకంటే నేనేం తక్కువ చేశాను. నేను చాలా కష్టపడ్డాను కదా అని ఫీలవుతుందట పాపం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: