నందమూరి నటసింహం బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య ను కొత్తగా చూపించనున్నాడు బోయపాటి. ఇక ఈ చిత్రంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇటీవల వార్తలు రాగ తాజాగా దాని గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.
నేను బాలకృష్ణ గారి సినిమాలో నటించడం లేదు ఆ వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదు. ప్రస్తుతానికి తెలుగులో కేవలం జాతిరత్నాలు అనే సినిమా మాత్రమే చేస్తున్నానని నవీన్ వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా చాలా హిలేరియస్గా ఉంటుందని కరోనా వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆగిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. పిట్టగోడ ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రాహుల్ రామకృష్ణ ,ప్రియదర్శి కూడా హీరోలుగా నటిస్తున్నారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక
బాలయ్య -
బోయపాటి సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో
బాలయ్య సరసన కొత్త
హీరోయిన్ ను తీసుకోనున్నారు.
థమన్ సంగీతం అందిస్తుండగా మిర్యాల
రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత ఏడాది వరుసగా మూడు భారీ డిజాస్టర్లను చవిచూసిన
బాలకృష్ణ ఈసినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇంతకుముందు
బోయపాటి ,బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన
సింహ ,
లెజెండ్ బ్లాక్ బాస్టర్ హిట్లు కావడంతో ఈమూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.
దసరా కు ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.