ప్రస్తుతం కరోనా వ్యాధి ఎఫెక్ట్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించి ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేయబడడంతో టాలీవుడ్ నటులు పలువురు ఎక్కడికక్కడ తమ తమ ఇళ్లలో ఫ్యామిలీ లతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇక మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమాతో మరొక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుని వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. 

IHG

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఇకపోతే తన తదుపరి సినిమాని పరశురామ్ పెట్ల తో చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇప్పటికే ఆ సినిమా కథని విని ఓకే చేసినట్లు తెలుస్తోంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు, రొమాన్స్, లవ్, ఎంటర్టైన్మెంట్ వంటి పలు అంశాల మేళవింపుగా దర్శకుడు పరశురామ్సినిమా కథని సిద్ధం చేసాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ లో అక్కడక్కడా ఉన్న లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నాడట పరశురామ్. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజలుగా పలువురు హీరోయిన్ల పేరు తెరపైకి వస్తున్నాయి. 

 

కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ల మధ్యనే భారీ పోటీ నెలకొని ఉందని అంటున్నారు. ముందుగా కీర్తి సురేష్ ని ఈ సినిమా కోసం తీసుకుందాం అని భావించినప్పటికీ ఆమెకు డేట్స్ లేని కారణంగా ఈ సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు, ఇక కియారా అద్వానీ పరిస్థితి కూడా ఒకరకంగా అంతే ఉందని, అయితే ఈ ఇద్దరిలో ఎవరికి వీలు కుదిరితే వారిని తీసుకుందాం అని దర్శకుడు పరశురామ్ ఫిక్స్ అయ్యాడట. అలానే వీరిలో ఎవరో ఒకరిని తప్ప మరొక హీరోయిన్ ని తీసుకునే అవకాశం లేదని, ప్రస్తుతం జరుగుతున్న ఈ టఫ్ ఫైట్ లో ఎవరు ఈ సినిమా అవకాశాన్ని చేజిక్కించుకుంటారో చూడాలని అంటున్నారు....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: