రెండేళ్ల క్రితం హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ అంచనాలు ఎందుకోలేక ఘోరంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ 25వ సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరయ్యాయి. అందునా తమకు ఎంతో ఇష్టమయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో వారి అంచాలు ఆకాశమే హద్దుగా చేరాయి. 

 

ఇకపోతే ఆ సినిమా తరువాత తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమయిన పవన్, మళ్ళి అతి త్వరలో వకీల్ సాబ్ ద్వారా ప్రేక్షకుల ముందు రానున్నారు. ప్రస్తుతం చాలా వరకు షూటింగ్ ని జరుపుకున్న ఆ సినిమా, ఈ లాక్ డౌన్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దానితో పాటు మరోవైపు కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో పవన్ నటిస్తున్నారు. ఏ ఎమ్ రత్నం నిర్మాతగా శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమా ఇటీవల రెండు షెడ్యూల్స్ జరుపుకున్నట్లు సమాచారం. స్వరవాణి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పవన్ ఒక గజదొంగగా నటిస్తున్నట్లు టాక్. 

 

ఇక ఈ రెండిటి తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మరొక సినిమా చేయనున్న పవన్, మొత్తంగా ఈ మూడు సినిమాలతో సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టడం ఖాయం అని, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని దున్నేయబడి పవన్ పేరిట సరికొత్త రికార్డులు సృష్టించబడతాయని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. తప్పకండా అటు వకీల్ సాబ్, ఇటు క్రిష్ సినిమా, అలానే హరీష్ శంకర్ సినిమాలు మూడు కూడా హిట్ కొట్టి పవన్ కి హ్యాట్రిక్ ని కూడా అందించడం ఖాయం అని పలువురు ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆశాభావం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: