తెలుగు వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యింది యాంకర్ అనసూయ.  ఇప్పటి వరకు తెలుగు ఎవరూ కనిపించని రీతిలో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో అనయసూ అందం, హవభావాలు, మాట తీరు ప్రేక్షకులను కట్టి పడేశాయి.  ఒకరకంగా చెప్పాలంటే జబర్ధస్త్ కామెడీ షోకి స్కిట్స్, జడ్జీల తీర్పు ఒక ఎత్తైతే యాంకర్ అనసూయ హంగామా మరో ఎత్తు అనుకోవాలి.  అలాంటి యాంకర్ అతి తక్కువ సమయంలోనే వెండితెరపై ఛాన్స్ దక్కించుకుంది.  ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీతో అనసూయకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

 

ఒకటీ రెండు సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో కూడా నటించి మెప్పించింది.  ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూనే జబర్ధస్త్ కామెడీ షో లో కొనసాగుతుంది.  ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అనసూయ ఆమె అలవాట్లు, అభిరుచులు, అభిప్రాయాలు,ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ఒక ప్రశ్నకి ఆమె స్పందిస్తూ .. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్ మేన్' సినిమా అంటే నాకు చాలా ఇష్టం.

 

ఈ మూవీలో అర్జున్ నటన చూసి ఫిదా అయ్యానని.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమాతో ఆయనంటే క్రష్ ఏర్పడింది. అప్పట్లో ఆయనకి నేను వీరాభిమానిని" అంటూ చెప్పుకొచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ కెరీర్ లో ‘జెంటిల్ మేన్’ మూవీ ఓ మరుపురాని మైలురాయి అని.. లంచాల కోసం కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే వారి గురించి ఈ మూవీలో ఉంటుంది.  ఈ మూవీతో యాక్షన్ హీరో అర్జున్ కి కూడా మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంగా సెలబ్రెటీలు ఇంటిపట్టునే ఉంటున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: