టాలీవుడ్ లో ఇప్పుడు పూజ హెగ్డే హవా నడుస్తుంది. ఆమె తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె ఇటీవలి కాలంలో చాలా మంది లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అరవింద సమేత సినిమా తో ఎన్టీఆర్ కి ఆమె లక్కీ అయిపోయింది. ఇటీవల అల్లు అర్జున్ తో చేసిన సినిమాతో ఆమె లక్కీ అయిపోయింది.ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి విజయాన్ని ఇచ్చాయి అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. ప్రస్తుతం ఆమె తో సినిమా చేయడానికి గానూ బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఆమెకు అవకాశ ఇస్తామని చెప్తున్నారు 

 

ఆమె కూడా బాలీవుడ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. వరుస సినిమాలను అక్కడ ఆమె ఓకే చేస్తుంది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె లెగ్ మంచిది అని భావించి ఆమెను తీసుకోవడానికి గానూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు భారీగా రేటు కూడా పెంచిన సంగతి తెలిసిందే ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇప్పుడు కొత్త హీరోయిన్ తో సినిమా చేసే ఆలోచనలో లేడు అనే విషయం అర్ధమవుతుంది. దీనితో ఆమె తనకు ఉన్న స్టార్ ఇమేజ్ ని వాడుకోవాలి అని భావిస్తుంది. తన సినిమాల్లో తానే పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలో కూడా ఆమె ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ప్రస్తుత౦ ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలను చేస్తుంది పూజ. అక్కడి దర్శక నిర్మాతలు ఇప్పుడు పాప కోసం ఎదురు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు తీవ్రంగా ఆమె కష్ట పడుతుంది అని అంటున్నారు. బాలీవుడ్ లో హిట్ అయితే తిరుగు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: