టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా తమ సత్తా చాటుతూ వస్తున్నారు. గత కొంత కాలంగా కొంతమంది హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. హింది, తెలుగు, తమిళ భాషల్లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే.. అనుకోకుండా సినిమాలకు దూరం అయ్యింది. లండన్కి చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు, ముంబయి లో కొంత కాలం వీరు డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకదశలో వీరి వివాహానికి కమల్ హాసన్ కూడా సై అన్నారట.
కానీ అనూహ్యంగా వీరిద్దరి మద్య బ్రేక్ రావడం.. శృతిహాసన్ కొద్ది కాలం డిప్రేషన్ లోకి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం ఆమె అన్నీ పక్కబెట్టి మళ్లీ మూవీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గోపించద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు వచ్చే ఫోన్ కాల్స్ను రికార్డు చేస్తానని ప్రముఖ నటి శ్రుతిహాసన్ చెప్పింది.
తన ఫోన్లో కాల్ రికార్డ్ యాప్ను ఎక్కువగా వాడుతానని ఈమెయిల్, మెస్సేజ్లు కాకుండా తాను ఎక్కువగా ఉపయోగించే యాప్ ఇదేనని తెలిపింది. ప్రస్తుతం తన ఇంటికే పరిమితమైన శ్రుతి సోషల్ మీడియాతో అభిమానులతో టచ్లో ఉంది. లాక్డౌన్లో తాను ఏం చేస్తున్నానో వారితో పంచుకుంది. తనకు సిగరెట్, పొగాకు వాసన అంటే ఇష్టమని చెప్పింది. అయితే, వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదు అని తెలిపింది. చిన్నప్పుడు ఎరైజర్ సువాసనను ఎక్కువగా ఇష్టపడేదానినని శ్రుతి తెలిపింది. గులాబి, చాక్లెట్, పెన్సిల్, వెనిలా ఫ్లేవర్ వాసన అంటే కూడా ఇష్టమని చెప్పింది.