టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఒక్క హిట్ కూడా మనోడికి పడలేదు. దాంతో మంచి హిట్ కోసం కసిగా ఎదురు చూస్తున్న సమయంలో అప్పటి వరకు వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. అనుకున్నట్టుగానే ఈ మూవీ బ్లాక్ బస్టర్ సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే.. `ఇస్మార్ట్ శంకర్`.. ముగ్గురి కెరీర్లని మలుపు తిప్పింది. వరుస ఫ్లాపుల్లో వున్న దర్శకుడు పూరి జగన్నాథ్కు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి కెరీర్పై కొత్త ఆశలు చిగురించేలా చేసింది. హీరోగా రామ్ కెరీర్ ని నిలబెట్టింది.. ఇక నటిగా కెరీర్ని మందగించడంతో నటనకు బ్రేకిచ్చిన చార్మికి నిర్మాతగా తొలి సక్సెస్ని బాగా అందించింది.
బాక్సాఫీస్ వద్ద 40 కోట్లు వసూలు చూసి చిత్రంగా హీరో రామ్ కెరీర్లోనే రికార్డు సృష్టించింది. రామ్ మాసీవ్ లుక్, తెలంగాణ స్లాంగ్, మణిశర్మ సంగీతం ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి. సక్సెస్ పరంగా చాలాకాలం తరువాత పూర్తిస్థాయిలో పూరి దాహాన్నితీర్చింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డుని సొంతం చేసుకుంది. ఈ మూవీ హిందీలోనూ డబ్ చేశారు. డబ్బింగ్ చేసి ఫిబ్రవరిలో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు.
తాజాగా ఈ మూవీ 100 మిలియన్ వ్యూస్ని దాటింది. దీంతో చయిత్ర బృందం సంబరాలు చేసుకుంటోంది. ప్రస్తుతం రామ్ నటిస్తున్న సినిమా `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషర్ నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవల రామ్ ఈ మూవీ థియేటర్లోనే రిలీజ్ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే.