ఒకరేమో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. మరోకరేమో మిస్ వరల్డ్ కిరీటధారి. వీరిద్దరూ కలసి సినిమా చేస్తే అభిమానులకు ఆనందం. సినిమా ప్రేక్షకులకు కన్నుల పండుగే. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షమే. ట్రేడ్ సర్కిల్స్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోయి భారీ బిజినెస్ ఖాయం. ఇంతటి ఇంపాక్ట్ చేయగలిగే స్టార్స్ ఎవరంటే ఒకరు రజినీకాంత్, మరొకరు ఐశ్వర్యా రాయ్. వీరిద్దరూ కలసి పదేళ్ల క్రితం రోబో సినిమాలో నటించారు. కానీ అంతకంటే ముందు రజినీ సినిమాలో అవకాశాన్ని ఐశ్వర్యా రాయ్ వదులుకుంది.

IHG

 

నిజానికి ఇరవై ఏళ్ల క్రితమే రజినీకాంత్ తన పడయప్పా సినిమాలో నీలాంబరి పాత్రకు ఐశ్వర్యా రాయ్ ను అనుకున్నారట. ఆ మేరకు ఐశ్వర్యను సంప్రదించగా నో చెప్పిందట. తర్వాత 2005లో వచ్చిన చంద్రముఖిలో కూడా జ్యోతిక పాత్రకు మొదట ఐశ్వర్యా రాయ్ నే సంప్రదించగా అప్పుడు కూడా చేయలేనని చెప్పిందట. ఆ పాత్రలో జ్యోతిక సరిపోదేమోనని రజినీ సందేహం. కానీ దర్శకుడు వాసు ప్రోద్బలంతో జ్యోతికతో ఆ క్యారెక్టర్ చేయించారు. ఫలితం తెలిసిందే. దీంతో రజినీ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారట. తర్వాత 2007లో వచ్చిన శివాజీ సినిమాలో శ్రియ పాత్రకు కూడా మొదట సంప్రదించింది ఐశ్వర్యనే. ఈసారి కూడా ఆమె నో చెప్పడంతో శ్రియను తీసుకున్నారట.

IHG

 

చివరికి 2010లో వచ్చిన శివాజీ సినిమాకు ఐశ్వర్యను సంప్రదించగా ఆ సమయంలో ఓకే చేసి రజినీకి జోడీగా నటించింది. ఈ విషయాలన్నీ ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో జోరుగా షికారు చేస్తున్నాయి. ఐశ్వర్యతో కలిసి నటించాలనే రజినీ కోరిక మేరకే ఇన్నిసార్లు ఆమెను సంప్రదించారట మేకర్స్. కానీ.. బిజీ షెడ్యూల్స్ తో డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ఐశ్వర్య అన్నిసార్లు రజినీతో సినిమాలు చేయలేకపోయిందట. రోబోలో వీరి జంట ప్రేక్షకులను కనువిందు చేసిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: