టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు శేఖర్ కమ్ముల. ఈయన తీసే ప్రతి సినిమా ఓవర్సీస్ లో భారీ రేటు పలుకుతుంది.  సున్నితమైన ప్రేమ కథ.. కుటుంబ నేపథ్యంలో ఈయన సినిమాలు ఉంటాయి.  ప్రస్తుతం శేఖర్ కమ్ముల, నాగ చైతన్య కాంబినేషన్ లో ‘లవ్ స్టోరీ’ మూవీ వస్తుంది.  ఈ మూవిలో ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.  డాలర్ డ్రీమ్స్  సినిమాకి దర్శకత్వం వహించి ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే  ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నాడు.  ఆ తర్వాత మరో ప్రేమకథ ‘ఆనంద్’ మంచి కాఫీలాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 

ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా ఇలా ఈ సినిమాలకి దర్శకత్వం వహించాడు.  తన సినిమాల్లో హీరో, హీయిన్లకు మంచి ప్రాముఖ్యత ఇస్తుంటారు శేఖర్ కమ్ముల. ఫిదా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ ఇచ్చి నాగ చైతన్యతో సినిమా తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల తరువాత సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈసారి రొటీన్ కి భిన్నంగా ఆయన థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. కొత్తదనం కోసం తొలిసారిగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.  

 

ఇప్పటి వరకూ ప్రేమకథా చిత్రాలలో సున్నితమైన భావాలను తెరపై ఆవిష్కరిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల, ఒక్కసారిగా రూట్ మార్చాడనే ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.. ఒకవేళ ఇలాంటి సినిమా తీస్తే ఆయన శైలి కూడా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు.  ఏది ఏమైనా వల్గారిటీ,మాఫియా,హింస లాంటివి శేఖర్ కమ్ముల సినిమాలో ఉండవు.. మరి థ్రిల్లర్ మూవీ అంటే అందరూ ఆలోచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: