శంకర్ నుంచి ఒక సినిమా ప్రేక్షకులే కాదు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శక నిర్మాతలు, హీరోలు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తారు. అందుకు కారణం ఆయన సినిమాలలో ఉండే సోషల్ మెసేజే. ఈసారి ఎలాంటి సోషల్ ఇష్యూ మీద సినిమా తీశారని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. అదే ఆతృత ఇప్పుడు నెలకొంది.  ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ..'ఇండియన్ 2' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తమిళం, హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 

 

దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్ళీ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'భారతీయుడు 2' సినిమాపై తమిళ ఇండస్ట్రీతో పాటు మిగతా సినీ ఇండస్ట్రీలో భారీగా ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఈ సినిమాతో కొత్త రికార్డ్ లు నెలకొల్పాలన్న కసితో కమల్ హాసన్ శంకర్ ఉండటమే. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. 'ఇండియన్ 2' రెగ్యులర్ షూటింగ్ మొదలై తర్వాత మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయింది కూడా. 

 

ఇక ఇదే సినిమాని 'భారతీయుడు 2' గాను తెలుగులో రిలీజ్ చేస్తుండగా కమల్ హాసన్‌కు జోడిగా కాజల్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని వార్తలు వచ్చాయి.

 

దాంతో ఈ సినిమా షూటింగ్ ని ఆపేశారు. ఇదే ఒక పెద్ద దెబ్బ అయితే ఇప్పుడు ఈ సినిమా కి కరోనా కష్టాలు పాతాళానికి తొక్కేశాయి. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పట్లో మొదలవదని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కాజల్ తెగ సంబరపడింది. అయితే అది ఇపుడు కాజల్ కి పెద్ద షాక్ అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: