స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కన్నడ బ్యూటి రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'పుష్ప'. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. వరస విజయాలను అందిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఆర్య'.. 'ఆర్య2' తర్వాత అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రూపొందుతుంది. 

 

శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా కథ ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ రాయలసీమ యాసలో మాట్లాడనున్నాడు. అంతేకాదు హీరోయిన్ రష్మిక కూడా చిత్తూరు యాసలో మాట్లాడుతుందట. ఇప్పటికే ఈ యాసలో మాట్లాడటానికి రష్మిక కుస్తీ పడుతోంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అల్లు అర్జున్ కంప్లీట్ మాస్ గెటప్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. ఇక ఈ సినిమాని తెలుగు-హిందీ-తమిళం- మలయాళం-కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.  

 

ఇక అల్లు అర్జున్-సుకుమర్-దేవీ శ్రీప్రసాద్ కలిసి మళ్ళీ మ్యాజిక్ చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ మూడు పాటలని కంపోజ్ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమాలో రానటువంటి అద్భుతమైన మాస్ సాంగ్ ని కంపోజ్ చేయబోతున్నాడట. ఇక సుకుమార్సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందట. ఇంతకముందు సుకుమార్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

 

ముఖ్యంగా దేవీశ్రీ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ ఎప్పటికి నిలిచిపోతుంది. ఇక మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే తారక్ ఫ్యాన్స్ కి పండగే. సుకుమార్ పుష్ప కంప్లీట్ చేసేలోపు ఎన్.టి.ఆర్ త్రివిక్రం సినిమా కంప్లీట్ చేస్తాడట. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: