తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత జీవితంపై ప్రస్తుతం మూడు బయోపిక్స్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీట్లో ఒకటి వెబ్ సిరీస్ కాగా రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'తలైవి'. అలాగే నిత్యా మీనన్ నటిస్తున్న 'ది ఐరన్ లేడీ' సినిమా ఒకటి. ఇక 'తలైవి' సినిమాలో జయలలిత పాత్రను బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కంగన ని నిత్యా మీనన్ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లుక్ లో బీట్ చేసింది. 

 

ఇక తమిళ ప్రజలు రెండు పాత్రలని కంపేర్ చేస్తున్నారు. ఎక్కువగా నిత్యామీనన్ కే సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందుకు కారణం కంగనా బాలీవుడ్ హీరోయిన్ అవడమే.  జయలలిత గా ఇద్దరి పోస్టర్స్ ని పక్క పక్కన పెట్టి చూస్తే నిత్యా మీనన్ అంత పర్ఫెక్ట్ గా కంగన సెట్ అవలేదంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఇది వాస్తవం కూడా. రెండు సినిమాల పోస్టర్స్ ని గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 'ది ఐరన్‌ లేడీ' పేరుతో వస్తున్న ఈ సినిమాకి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. కంగన కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. అందుకే జయలలిత పాత్రలో కంగన లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తే సినిమాకి పాన్ ఇండియా క్రేజ్ బాగా వస్తుందన్న కారణంగా కంగన ని సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.
 

ఇక నిత్యా మీనన్ మాత్రం జయలలిత గెటప్ లో అద్భుతంగా కనిపిస్తుందని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక నటన పరంగా కూడా నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత్రలో ఇట్టే ఇమిడిపోతుంది. అయితే ఇప్పుడు కొత్తగా కీర్తి సురేష్ తో నిత్యామీనన్ ని పోల్చుకుంటున్నారట కోలీవుడ్ ప్రేక్షకులు. అందుకు కారణం ఇంతకముందు కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకుంది. అందుకే నిత్యామీనన్ కి కీర్తి సురేష్ కి వచ్చినంత పాపులారిటి జయలిల బయోపిక్ తో వస్తుందా అని అంటున్నారట. ఇక ఇదే బయోపిక్ తో వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుండగా రమ్యకృష్ణ ఇందులో జయలలిత గా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: