అనుష్క నటించిన తాజా చిత్రం 'నిశబ్దం'. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత అనుష్క భాగమతి సినిమాలో నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. వసూళ్ళ పరంగా కూడా పరవాలేదనిపించింది. అయితే భారీ సక్సస్ మాత్రం అందుకోలేకపోయింది. వాస్తవంగా అరుంధతి తర్వాత మళ్ళి అనుష్క భాగమతి సినిమాతో ప్రేక్షకుల వస్తుందనగానే అందరూ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని ఆ అంచనాలని భాగమతి అందుకోలేకపోయింది. దాంతో అనుష్క మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయం తీసుకుంది. అంతేకాదు ఈ సారి గట్టి హిట్ కొట్టాలన్న పట్టుదలతోను ఉంది.

 

అయితే అనూహ్యంగా కోన వెంకట్ కలవడం నిశబ్ధం సినిమా కథ గురించి చెప్పడంతో ఆ కథ విపరీతంగా నచ్చి కోన వెంకట్ కి వెంటనే ఒకే చెప్పింది. మల్టీ లాంగ్వేజ్ సినిమా కావడంతో ఈ సినిమా మీద అనుష్క తో పాటు ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందులో కోన వెంకట్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా సక్సస్ మీద చాలామంది నమ్మకం పెట్టున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి పాత్రలో నటిస్తుంది. ఇప్పటి వరకు చేయని పాత్ర కావడంతో అనుష్కసినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇక మాధవన్, శాలిని పాండే, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

 

ఇక ఇప్పటికే పోస్టర్స్, టీజర్‌తో ఈ సినిమా హిట్ అన్న టాక్ ప్రేక్షకుల్లో ఉంది. వాస్తవంగా అయితే 'నిశబ్దం' ఏప్రిల్‌ ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని కరోనా కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో మళ్ళీ తమ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేసుకునే ప్లాన్స్ లో ఉన్నారు దర్శక, నిర్మాతలు. అయితే కోన వెంకట్ మాత్రం ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీకి రాలేకపోతున్నాడట. అంతేకాదు అనుష్క కూడా ఈ సినిమా సక్సస్ మీదే తన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉండబోతున్నాయని సమాచారం. మరి ఈ సినిమా రిజల్ట్ తో అనుష్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: