యాంకర్ గా, సినీ నటిగా రష్మీ గౌతమ్ పరిచయం అక్కరలేని పేరు. ముఖ్యంగా తెలుగులో ఎంతో ప్రేక్షకాదరణ పొందిన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఆమె ఎంతో పేరు తెచ్చుకుంది. తన వాక్చాతుర్యంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించే రష్మీకి మూగ జీవాలపై ప్రేమ ఎక్కువ. సామాజిక స్పృహ మెండుగా ఉన్న రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. పలు సమస్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వికృత తాండవం చేస్తున్న సమయంలో తనలోని మానవత్వాన్ని వాటిపై ఉన్న తన ప్రేమను చాటుకుంది.

 

 

లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇప్పటికి నెలకు పైగా వ్యవస్థలన్నీ కూడా నిస్తేజమైపోయాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వీధి శునకాలకు ఆహారం అందక పోవడం గమనించిన రష్మీ వాటికి ఆహారం అందించేందుకు ముందుకొచ్చింది. జంతు ప్రేమికులు చేస్తున్న సాయాన్ని తాను కూడా చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా వీధుల్లోని జంతువులకు ఆహారాన్ని అందిస్తోంది. రష్మీ శునకాలకు, వీధుల్లో సంచరించే ఆవులకు ఆహారం, నీళ్లు అందించే ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రష్మీ గౌతమ్ శునకాలకు ఆహారం అందించింది. వాలంటీర్లు అందిస్తున్న సాయానికి తానూ చేదోడువాదోడుగా నిలిచింది.

 

 

ఎంతో మంది అసంఘటిత కార్మికులకు ఆహారం దొరకని పరిస్థితులు ప్రస్తుత లాక్ డౌన్ లో నెలకొన్నాయి. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో వీధుల్లో తిరిగే మూగజీవాలకు ఆహారం కూడా కష్టమైంది. ఎంతోమంది ఇలా తమ విశాల హృదయంతో జంతువులకు ఆహారం అందించారు. ప్రజలంతా తమను తాము రక్షించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూగ జీవాలనుకూడా ఆదుకోవడం మంచి పరిణామం. ఇందుకు రష్మీ గౌతమ్ చేస్తున్న సాయాన్ని మెచ్చుకోవాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: