హీరోడైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని, ఈ దర్శకుడు ఇంట్రస్టింగ్ స్టోరీని ఓ స్టార్ హీరోకి చెప్పాడని విపరీతంగా న్యూస్ వైరల్ అవుతున్నాయి. అలా ఈ మద్య కాలంలో క్రేజీ గా తెరమీదకొస్తున్న సరికొత్త కాంబినేషన్లు, ప్రపోజల్స్ లాక్ డౌన్ టౌమ్ లో రకరకాలుగా వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో అందరూ ఖాళీగా ఉండడంతో హీరోలు కథలు వింటున్నారు. డైరెక్టర్లు తమ సినిమాలు ఓకే చేయించుకోడానికి హీరోలకోసం కొత్త కొత్త స్టోరీలు తయారు చేసుకుంటున్నారు.  అందుకే కొత్త కొత్త కాంబినేషన్లు తెరమీదకొస్తున్నాయి. వీటిలో  ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ప్రభాస్ , ప్రశాంత్ నీల్.
 
ప్రశాంత్ నీల్ ప్రజెంట్ కెజిఎఫ్ 2 చేస్తున్నాడు. ప్రభాస్ కూడా జాన్ సినిమా తో ఎంగేజ్ అయ్యాడు. జాన్ తర్వాత నాగాశ్విన్ తో  ప్యాన్ వరల్డ్ మూవీ చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలుకంప్లీట్ అయ్యాక ప్రభాస్ ప్రశాంత్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా కెజిఎఫ్ 2 కంప్లీట్ అయ్యాక ప్రభాస్ స్క్రిప్ట్ మీద ఫుల్ టైమ్ స్పెండ్ చెయ్యబోతున్నాడట.

 

మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ కొరటాల తోఆచార్య సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సాహో డైరెక్టర్  సుజిత్ తో లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు .. హరీష్ శంకర్, బాబీ లాంటి డైరెక్టర్లతో కూడా పనిచెయ్యడానికి మెగాస్టార్ ఇంట్రస్ట్ చూపించడంతో.. త్వరలోనే సరికొత్త కాంబినేషన్స్ ని చూడబోతోంది టాలీవుడ్.

 

టాలీవుడ్ లో వినిపిస్తున్న మరో  ఇంట్రస్టింగ్ కాంబినేషన్ వంశీ పైడిపల్లి - రామ్ చరణ్.  ఎవడు సినిమాతో చరన్ కు మంచి హిట్ ఇచ్చిన వంశీ మళ్లీ తనతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. సరిలేరునీకెవ్వరు తర్వాత మహేష్ ..వంశీ కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్ చేసినా అది వర్కవుట్ అవ్వకపోవడంతో ..ఇక లేట్ చెయ్యకుండా వంశీ.. చరన్ తో సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట.
 
కామెడీ ఎంటర్ టైనర్ల తో వరుసగా హిట్లు కొడుతున్న అనిల్ రావిపూడి .. ఈ సారి సీనియర్ హీరో కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.  అంతకుముందే వీళ్లిద్దిరి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉన్నా.. మిస్ అయ్యిపోయిందని టాక్. డేరింగ డైరెక్టర్ పూరీ జగన్ కూడా ఆ లాక్ డౌన్ టైమ్ లో బాలయ్య కోసమేకథ రాస్తున్నాడని టాలీవుడ్ లో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫైటర్ తర్వాత పూరీ.. బాలయ్య తో సినిమా చేసేట్టైతే.. మరో పైసా వసూల్ లాంటి ఎంటర్ టైనర్ పక్కా  అంటున్నారు ఫ్యాన్స్‌.

 

అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న అల్లు శిరీష్  కూడా కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు . కళ్యాణ్ దేవ్ తో విజేత సినమా చేసిన రాకేష్ శశితో సినిమా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడట శిరీష్. లాస్ట్ ఇయర్ ఎబిసిడి లాంటి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను మెప్పించాడు శిరీష్.  ఇలా కొత్త కొత్త సినిమాలు , కాంబినేషన్లు తెరమీదకు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: