టాలీవుడ్ జనాలకు ఇప్పుడు సినిమా కావాలి. సినిమా లేకపోతే మాత్రం చాలా మందికి పిచ్చి ఎక్కేలా ఉందనే కథనాలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మహేష్ బాబు నుంచి చిన్న హీరోల వరకు అందరూ తర్వాతి సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఒక్క సినిమా వచ్చినా చాలు అనుకునే విధంగా ప్రేక్షకులు ఆలోచన చేస్తుంటే ఒక్క సినిమా అయినా షూటింగ్ కి వెళ్తే చాలు అని ప్రేక్షకులు హీరోలు అనుకునే పరిస్థితి ఇప్పుడు టాలీవుడ్ లో ఉందీ అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. 

 

ఇక ఇది పక్కన పెడితే తర్వాత సినిమాల మీద చాలా మంది ఆశలు పడుతున్నారు. అందులో ప్రధానంగా మహేష్ బాబు. ఆయన సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఏ దర్శకుడు కూడా ఆయన తో సినిమా చెయడానీకి ముందుకు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం అర్ధమవుతుంది. ఒక్క దర్శకుడు కూడా ఇప్పుడు కథ రెడీ చేయడం లేదు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. గీత గోవిందం ఫేం పరుశురాం కూడా ఇప్పుడు వెనక్కు తగ్గే పరిస్థితి ఏర్పడింది .

 

అనీల్ రావిపూడి కూడా మహేష్ తో సినిమా చేయడం లేదు. ఎవరో ఒకరు కథ రెడీ చెయ్యాలని మహేష్ కోరుతున్నా వాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. వంశీ పైడపల్లి కూడా కథ రెడీ చేయడం లో అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం మహేష్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ లాక్ డౌన్ కాలంలో బాగా ఇబ్బ౦ది పడిన హీరో ఎవరు అయినా ఉన్నారు అంటే అది కేవలం మహేష్ బాబు అని గట్టిగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏ సినిమా చేస్తారో కూడా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: