ఈఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో వచ్చి బ్లాక్  బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తరువాత మహేష్ తన 27 వ చిత్రాన్ని గీత గోవిందం ఫేమ్ పరుశురాంతో చేయనున్నాడని తెలిసిందే. అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ప్రారంభం కాదని వార్తలు వచ్చాయి కానీ తాజాగా పరశురామే తన నెక్స్ట్ మూవీ మహేష్ తోనని చెప్పేశాడు. అలాగే మహేష్ కెరీర్ ను మలుపుతిప్పిన కల్ట్ మూవీ ఒక్కడు చూసి సినిమాల్లోకి వచ్చాను, మహేష్ బాబు తో సినిమా చేయడం నా కల.. ఆ కల నెరవేరుతుంనందుకు సంతోషంగా వుంది. ఈసినిమా మహేష్ కెరీర్ లోనే గుర్తిండిపోయే సినిమా అవుతుంది. 
 
 
అంతేకాదు మొదటి సారి ఎలివేషన్  సీన్లు రాస్తున్నాని పరశురామ్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ను నిర్మించనుండగా గోపి సుందర్  సంగీతం అందించే అవకాశాలు వున్నాయి. లాక్ డౌన్ ముగిసి ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చాక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈచిత్రం లో కీర్తి సురేష్  ను హీరోయిన్ గా తీసుకోనున్నారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే క్యాస్టింగ్ విషయంలో క్లారిటీ రానుంది. 
 
 
అయితే ఈసినిమా కన్నా ముందు పరశురాం , యువ సామ్రాట్ నాగ చైతన్య తో సినిమా చేయాల్సివుంది. అయితే మహేష్ తో సినిమా ఓకే అయిపోయేసరికి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. మరి ఆ సినిమా అయిపోయాకైనా నాగ చైతన్య తో పరుశురాం సినిమా  చేస్తాడో లేదో చూడాలి. 14 రీల్స్ పతాకం పై రామ్ ఆచంట , గోపిచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: