ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో బుల్లితెర నే కాకుండా వెండితెరను కూడా ఒక షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు బోల్తా కొట్టాయి అని చెప్పవచ్చు. ఇకపోతే బుల్లితెర పై మాత్రం రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మామూలుగా రష్మికి మూగజీవాల పై చాలా ప్రేమ.

IHG


ఈ విషయం రష్మీ ని ఫాలో అయ్యే ప్రతి ఒక అభిమానికి తెలిసే ఉంటుంది. దీనికి కారణం ఆమె రోజుకి ఒక పది సోషల్ మీడియా పోస్ట్ చేస్తే అందులో తొమ్మిది ఇది జంతువులపై మాత్రమే ఉంటాయని తెలుసు. అందులో కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోండి అని ఆహారం అందించండి అని కోరుతూ ఉంటుంది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో కూడా మూగజీవాలకు తిండి పెట్టేందుకు స్వయంగా ఆవిడే ఒక బకెట్ తీసుకొని వీధి కుక్కలకు ఆహారాన్ని పెట్టింది. ఇక చివరికి పుట్టినరోజు సందర్భంగా కూడా జంతువులతోనే గడిపింది. 


అయితే తాజాగా రష్మి తన పుట్టినరోజును ఎలా చేసుకుందో తెలుపుతూ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే పుట్టిన రోజును పూర్తిగా అమ్మతోనే గడపానని, ఎక్కడున్నా సరే సాధ్యమైనంతవరకు అమ్మ దగ్గరికి వచ్చేందుకు నేను ప్రయత్నిస్తానని ఆవిడ తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకుంటున్న తెలిపింది.అయితే బయట నుంచి కేక్ తీసుకొస్తాను అని కొందరు చెబితే కానీ అమ్మ మాత్రం వద్దని పెద్ద వార్నింగ్ ఇచ్చింది అని చెప్పింది. డెలివరీ బాయ్ వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని అందుకే వద్దని చెప్పి ఇంట్లోనే నా కోసం స్పెషల్ కేకు తయారు చేసిందని రష్మీ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: