టాలీవుడ్ లో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే టాలీవుడ్ జనాలకు కొత్త ధనం అందించే యోచనలో ఉన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుత౦ మన తెలుగులో వస్తున్న సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ని మహేష్ సినిమాకు గానూ అడిగినట్టు సమాచారం. ఆమె భారీగా డిమాండ్ చేసిందని టాక్. 

 

దాదాపు 15 కోట్లు ఆమె డిమాండ్ చేసిందని టాలీవుడ్ జనం అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అయినా సరే ఎంత వరకు బాలీవుడ్ లో ఈ సినిమా దీపిక ఇమేజ్ మీద ఆడుతుందో చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు భయపడుతున్నారని ఆమె ను పక్కన పెట్టారు అని అంటున్నారు. ఆమె ఏ మాత్రం జాలీ దయా కూడా లేకుండా అడిగింది అని అంటున్నారు ఇదే కొనసాగిస్తే బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకునే అవకాశం ఉండదు అని భావిస్తున్నారట. ప్రస్తుతం మన తెలుగులో కమర్షియల్ హవా ఉండటం తోనే ఆమెను అడిగారట. 

 

ఆమెను చూసి ఇక్కడ హీరోయిన్ లు కూడా ఎక్కువ గా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది అని భావించి ఆమెను పక్కన పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా హీరోయిన్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి ఇంకెంత మంది హీరోయిన్ లు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి. కాగా మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తో చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: