నందమూరి వంశంలో సీనియర్  ఎన్టీయార్ తరువాత అంతలా ఫ్యామస్ అయింది అక్షరాలా బాలక్రిష్ణే. ఆయన్ని ఓన్ చేసుకున్నంతగా మిగిలిన నందమూరి హీరోలను ఆ సామాజిక వర్గం కూడా ఓన్ చేసుకోలేదని అంటారు. ఇక జూనియర్ ఎన్టీయార్ మూడవ తరంలో హీరోగా వెలుగుతున్నా ఆయనకు నందమూరి కుటుంబంతో విభేదాలు ఉన్నాయని ప్రచారం అయితే ఉంది.

 

వాటిని నిజం చేసేలా బాలక్రిష్ణ ఇపుడు జూనియర్ ఎన్టీయార్ చేసిన ఒక చాలంజిని పట్టించుకోకుండా పక్కన పెట్టేశాడని అంటున్నారు. రియల్ మ్యాన్ పేరిట టాలీవుడ్లో ఒక చాలెంజ్ హీరోలు, టాప్ డైరెక్టర్ల మధ్య ఈ లాక్ డౌన్ టైంలో జరుగుతోంది.  దానికి స్పందించిన వారు సీనియర్లలో మెగాస్టార్ తో పాటు, విక్టరీ వెంకటేష్ మాత్రమే. 

 

అయితే ఇదే చాలెంజిని తన బాబాయి బాలయ్యకు కూడా జూనియర్ చేశాడు. దాని మీద బాలయ్య ఎక్కడా రెస్పాండ్ అవలేదు. సరికదా ఆయన తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉన్నారు. ఇక బాలయ్య తాను చైర్మన్ గా ఉంటున్న నందమూరి బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ సిబ్బందికి తన వంతుగా సహాయం చేశాడు. అలాగే చిరంజీవి నాయకత్వంలోని సినీ కార్మికుల సహాయ నిధికి కూడా సాయం చేశాడు.

 

బాలయ్య జూనియర్ చాలెంజికి స్వీకరిస్తే ఆయన కూడా ఇంట్లో ఇంటిపని వంటపని కూడా చేసేవాడు. తన వీడియోను పబ్లిక్ కి షేర్ చేసేవాడు, ఇప్పటికి ఇన్నాళ్ళు అయినా కూడా అది జరగలేదు. దాంతో బాలయ్య జూనియర్ విషయంలో తన కోపం అలాగే ఉంచుకున్నాడు అంటున్నారు. మెగా క్యాంప్ తో జూనియర్ సన్నిహితంగా మెలగడం, తానంటే ఖాతరు లేకుండా ఉండడంతోనే బాలయ్య ఆగ్రహంగా ఉంటున్నాడన్న ప్రచారమూ ఉంది. ఏది ఏమైనా బాబాయ్, అబ్బాయి కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఆ మంచి రోజు వస్తుందా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: