నాగచైతన్య తర్వాతి లీగ్ లో ఎంట్రీ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే చైతూ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. హీరోగా తర్వాతి స్టెప్ తీసుకోవడానికి అక్కినేని హీరో వరుసగా క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నాడు. ఈ లిస్ట్ లో చైతూ సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్స్ పై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. 

 

మజిలీ బ్లాక్ బస్టర్ తో నాగచైతన్య మార్కెట్ రేంజ్ కాస్త పెరిగింది. ఈ సిినిమా ముందు వరకు 30కోట్లకు అటు ఇటుగా ఉన్న చైతూ మజిలీ సూపర్ హిట్ తో 50కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఈ అక్కినేని యంగ్ హీరో గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా నాగచైతన్య క్రేజీ కాంబినేషన్ పై ఫోకస్ చేస్తున్నాడు. 

 

నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి లాంటి హైబ్రిడ్ పిల్లతో జతకడుతున్నాడు. ఈ సినిమాలో కూడా చైతూ లవర్ బాయ్ క్యారెక్టరే ప్లే చేస్తున్నాడు. మజిలీలో ఉన్నట్టే అక్కినేని హీరో కాస్త డల్ గా ఉంటూనే ఎమోషనల్ గా ఉంటుందని ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక సినిమా తర్వాత చైతూ మరో ఇద్దరు సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. 

 

లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ డైరెక్షన్ మరోసారి నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకు వీరి కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పుడు అంతే మెమరబుల్ కథను చైతూ కోసం విక్రమ్ కుమార్ ప్లాన్ చేశాడట. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో అనుకుంటున్నారు. దీంతో పాటు గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరశురాం డైరెక్షన్ లో సైతం నాగచైతన్య కొత్త సినిమా ఆలోచనలో ఉన్నట్టు టాక్. మొత్తానికి చైతూ కూల్ గా స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: