తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు చిరంజీవి ముందు నుంచి కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే ఆయన కథ కూడా విన్న తర్వాతే సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళాలి అనే సలహా ఇస్తారని నిర్మాతల విషయంలో దర్శకుల విషయమో ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని టాలీవుడ్ లో టాక్ వినపడుతూ ఉంటుంది. ఆయన సినిమా వద్దు అంటే ఏ హీరో కూడా చేసే అవకాశం ఉండదు అని అంటున్నారు. 

 

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి టాలీవుడ్ లో. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు చెయ్యాలి అని చిరంజీవి వాళ్లకు సలహాలు ఇస్తున్నట్టు సమాచారం. ఏ సినిమా కూడా తొందరపడి చేయవద్దు అని ఆయన హెచ్చరించినట్టు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. చిన్న దర్శకుడు అయినా పెద్ద దర్శకుడు అయినా సరే ఒకటికి  వంద సార్లు ఆలోచించి సినిమా చెయ్యాలని భవిష్యత్తులో సినిమాలకు కష్ట కాలం ఉంటుందని ఆయన హెచ్చరించారట. ఎప్పుడు చూడని పరిస్థితులు ఉన్నాయని కాబట్టి జాగ్రత్త పడటమే మంచిది అని హెచ్చరించినట్టు సమాచారం. 

 

ఎవరూ కూడా అసలు తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పారట. అందుకే ఇప్పుడు మెగా హీరోలు అందరూ కూడా చిరంజీవి వద్దకు కథ తీసుకొచ్చి అప్పుడు సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని భారీ సినిమాలను చేయవద్దు అని కూడా చెప్పారట చిరంజీవి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా సరే తనకు ఫోన్ చెయ్యాలని కూడా ఆయన సూచనలు చేసినట్టు సమాచారం. భవిష్యత్తు ఉంటుంది గాని ఇప్పుడు మాత్రం పరిస్థితి ఏ విధంగా చూసినా సరే బాగా లేదు అని ఆయన చెప్పారట. మరి ఏ హీరోసినిమా చేస్తాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: