లాక్ డౌన్ తో నేచర్ లో చాలా మార్పులొచ్చాయని శాస్త్రవేత్తలంతా చెబుతున్నారు. అయితే ఈ లాక్ డౌన్ తో మహేశ్ బాబులోనూ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బిఫోర్ లాక్ డౌన్, ఆఫ్టర్ లాక్ డౌన్ అన్నట్టు జనాలు కూడా మహేశ్ లో చాలా ఛాంజెస్ చూస్తారని చెబుతున్నారు. ఇంతకీ మహేశ్ బాబులో కొత్తగా వస్తోన్న మార్పులేంటో తెలుసా.. ?

 

మహేశ్ బాబు బాక్సాఫీస్ దగ్గర దూకుడుగా ఉంటాడు. సిినిమా సినిమాకు వసూళ్లు పెంచుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ సినిమాల మధ్య గ్యాప్ ను మాత్రం పెద్దగా పట్టించుకోడు. ఏడాదికో సినిమా, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకే మరో ప్రాజెక్ట్ అన్నట్టు కాల్షీట్స్ ఇస్తుంటాడు. కానీ ట్వంటీట్వంటీలో మహేశ్ గేర్ మార్చుతున్నాడనీ.. దూకుడు చూపిస్తాడని చెబుతున్నారు ఇండస్ట్రీ జనాలు. 

 

మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఈ లోపు లాక్ డౌన్ తో ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితమైంది. అయితే ఈ లాక్ డౌన్ తర్వాత ప్రిన్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తాడనే టాక్ వస్తోంది. ఇప్పటికే పరశురామ్ తో సినిమాకు సిద్ధమైన మహేశ్.. మరో మూడు ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. 

 

మహేశ్ బాబుతో వచ్చే ఏడాది సినిమా తీస్తానని ఇంతకుముందే ప్రకటించాడు రాజమౌళి. ట్రిపుల్ ఆర్ పూర్తవ్వగానే మహేశ్ తో సినిమా స్టార్ట్ చేస్తానని ఎనౌన్స్ చేశాడు. మరోవైపు వంశీ పైడిపల్లి కూడా మహేశ్ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా రావాల్సింది. కానీ స్టోరీ ప్రాబ్లమ్ తో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు మహేశ్ ను ఇంప్రెస్ చేసేందుకు పక్కాగా ప్రిపేర్ అవుతున్నాడు.  

 

అర్జున్ రెడ్డితో వైబ్రేషన్స్ పాస్ చేసిన సందీప్ వంగా కూడా మహేశ్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. లాక్ డౌన్ కంప్లీట్ అవ్వగానే స్టోరీ నెరేషన్ ఉంటుందని సమాచారం. అర్జున్ రెడ్డి తర్వాత వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. ఈ లోపు కభీర్ సింగ్ కోసం ముంబయి వెళ్లిపోయాడు సందీప్. సో ఈ లైనప్ చూస్తే లాక్ డౌన్ పీరియడ్ లో మహేశ్ ఆలోచనలు మారిపోయినట్టే కనిపిస్తోంది. మరి ఈ ట్వంటీట్వంటీ నుంచైనా మహేశ్ టీ-ట్వంటీ ఆడతాడేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: