టాలీవుడ్ కి ముందుగా ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, ఫస్ట్ సినిమాలోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో కుర్రకారు మనసులో గిలిగింతలు పెట్టింది. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఆ తరువాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకున్న సమంత, ప్రతి ఒక్క అవకాశాన్ని అందుకుంటూ హీరోయిన్ గా మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో ఒకరిగా ఎదిగింది. 

IHG

నాగ చైతన్య ను వివాహం చేసుకున్న అనంతరం కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న సమంతకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇక ఇటీవల ఓ బేబీ, యు టర్న్ వంటి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి, తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మనసు దోచి మంచి సక్సెస్ లు అందుకున్న సమంత, మధ్యలో తన భర్త నాగ చైతన్యతో కలిసి మజిలీ సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. ఇక మొదటి నుండి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన ఫ్యామిలీ, సినిమా విశేషాలు ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో, ప్రేక్షకులతో షేర్ చేసుకునే అలవాటున్న సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువే అని చెప్పాలి. 

ఇక నిన్నటితో ఆమె ట్విట్టర్ అకౌంట్ ఏకంగా ఎనిమిది మిలియన్ల ఫాలోవర్లకు చేరడంతో సౌత్ ఇండియాలోనే అత్యధికమంది ట్విట్టర్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్ గా సమంత ఒక గొప్ప రికార్డు ని సొంతం చేసుకుని మరొక్కసారి తానే క్వీన్ అని నిరూపించుకుంది. అయితే ఎక్కువగా అందరితో సరదాగా మాట్లాడుతూ, అలానే తమవంటి ఎందరో ఫ్యాన్స్ మెసేజ్ లకు రిప్లై లు ఇస్తూ ఉండడం వల్లనే సోషల్ మీడియా మాధ్యమాల్లో సమంత కు మరింత పేరు వచ్చిందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: