మొత్తానికి మహేష్ బాబు నెక్స్ట్ సినిమా కోసం ఎప్పటినుండో ఎదురు చూపులు చూస్తున్న ఆయన ఫ్యాన్స్ కి నిన్న మంచి తీపు కబురు చెప్పాడు దర్శకుడు పరశురామ్. ఒక మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పరశురామ్ మాట్లాడుతూ, తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా చూసిన తరువాత టాలీవుడ్ మీద ఎంతో ఇంటరెస్ట్  కలిగిందని, ఆ తరువాత దర్శకుడిగా మారాలి అనే కసి తనలో పెరిగి మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు దర్శకుడిగా ఈ స్థాయికి వచ్చానని పరశురామ్ చెప్పాడు. 

IHG

ఇక తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ తోనే అని తేల్చి చెప్పిన పరశురామ్, ఆ కథ మొత్తం సిద్ధం అయిందని, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటున్న తాను, ఆ కథపై మరింత కసరత్తు చేస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు తన సినిమాల్లో ఎక్కువగా మంచి హ్యూమన్ ఎమోషన్స్ కు ప్రాధాన్యతనిచ్చిన తాను, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ వంటి బడా స్టార్ తో వర్క్ చేస్తుండడంతో ఈ సినిమాలో ఆయన ఇమేజ్ కి తగ్గట్లుగా మంచి ఎలివేషన్ సీన్స్ కూడా జోడించడం జరిగిందని, మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటూ తన శైలిలో సాగుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని పరశురామ్ అన్నాడు. 

 

అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై ఎప్పటినుండో టాలీవుడ్ లో పలు రకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై పరశురామ్ ఎటువంటి సమాధానం చెప్పనప్పటికీ, ఆయన సన్నిహితుల నుండి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ ఫిక్స్ అయినట్లుగా చెప్తున్నారు. ముందుగా ఈ సినిమాకు గోపిసుందర్ ని తీసుకుంటారని ఒక వార్త ప్రచారం అవ్వగా, అదేమి లేదు థమన్ ఫిక్స్ అయ్యారు అని అంటున్నారట. ఒకవేళ ఇదే వార్త కనుక నిజం అయితే థమన్ జాక్ పాటు కొట్టినట్లేగా మరి.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: