నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించనున్నాడని ప్రచారం జరిగింది. అయితే దీని పై తాజాగా బోయపాటి క్లారిటీ ఇచ్చాడు. అవును ఈసినిమాలో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపిస్తారు. ఆ క్యారెక్టర్ డిజైన్ అంతా కొత్తగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించాడు. 
 
థమన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు అయితే ఈ సినిమా కోసం కొత్త హీరోయిన్ ను అన్వేషిస్తున్నారట. దసరా కు ఈచిత్రాన్ని థియేటర్లోకి తీసుకురావడనికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయం అటు బాలకృష్ణ  అలాగే బోయపాటి కి  కీలకం కానుంది. ఎందుకంటే గత ఏడాది వీరికి ఏ మాత్రం కలిసి రాలేదు.
 
బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ గత ఏడాది సంక్రాంతికి రాగ దారుణమైన పరాభవాన్ని చవిచూసింది అంతేకాదు ఈ సినిమా తో బోయపాటి తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఇక బాలయ్య అయితే గత ఏడాది ఏకంగా మూడు భారీ డిజాస్టర్లను చవిచూశాడు. మరి ఈ సారి వీరిద్దరి ఈమూడో సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ అవుతారో లేదో చూడాలి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ ఒకదానిని మించి ఒకటి హిట్ కావడంతో ఈ మూడో సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: