మళయాల చిత్రమైన ప్రేమమ్ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా నటించిన సాయిపల్లవికి మళ్ళీ అలాంటి పాత్ర వస్తుందా అన్న అనుమానాలతో ఉన్న టైమ్ లో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసేసింది. ఆ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ ఉన్నప్పటికీ, సాయిపల్లవిదే డామినేషన్ లా కనిపించింది. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లదే డామినేషన్ ఉంటుందని అందరికీ తెలిసిందే.

 

 

అయితే ఫిదా తర్వాత సాయి పల్లవి తెలుగులో పడి పడి లేచే మనసు, ఎమ్ సీ ఏ, కణం వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, ఫిదా ద్వారా ఆమెకి వచ్చిన పాపులారిటీనే ఎక్కువ. నటనలోనూ, అందంలోనూ ఎవరినీ తీసిపోని సాయిపల్లవి ఆఫర్లు తక్కువ వచ్చాయనే చెప్పాలి. అయితే నిజానికి ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయట. కానీ సహజత్వానికి దూరంగా ఉండే పాత్రలు, గ్లామర్ ఒలకబోయాల్సిన రోల్స్ రావడంతో ఆమె వాటిలో నటించనని తిరస్కరించిందట.

 

 

ఇప్పటి వరకు సాయిపల్లవి చేసిన పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉన్నవే. చేసిన ప్రతీ పాత్రలో ఆమెలోని నటి కనిపిస్తుంది. మళ్ళీ అలాంటి రోల్స్ వస్తేనే సినిమాలు చేస్తానంటుంది. గ్లామర్ డాల్స్ గా కనిపించడం తనకి ఇష్టం లేదని చెప్తుంది. పాత్ర పరిధి చిన్నదైనా సరే కానీ రియలిస్టిక్ గా ఉంటేనే చేస్తానని చెప్తుంది. డబ్బు కోసమో, స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసమో చేయలేనని చెబుతుంది.

 

అలాగే కురచ దుస్తులు కూడా అస్సలు వేసుకోనంటుంది. ఫిదా సినిమాలో కురచ డ్రెస్ లో కనిపించినప్పటికీ, అది సినిమా పరంగా అవసరం కాబట్టి వేసుకున్నానని చెప్పింది. మరి ఇన్ని కండిషన్లు పెడుతున్న సాయిపల్లవికి అవకాశాలు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం సాయిపల్లవి నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: