టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా సాయి పల్లవికి వచ్చిన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఆమెకు ఫిదా సినిమా తర్వాత మంచి ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆమెకు మన తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి క్రేజ్ పెరగడమే కాకుండా చిన్న చిన్న దర్శకులు చాలా మంది ఆమెను తమ సినిమాలో ఉండాలి అని కోరే వాళ్ళు. ఇక అగ్ర దర్శకుల సినిమాలకు ఆమెను అడిగినా సరే ఆమె మాత్రం అందుకు ఆసక్తి చూపించలేదు. 

 

టాలీవుడ్ లో ప్రతీ సినిమా కూడా ఇప్పుడు హీరోయిన్ నటనకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ వస్తుంది. ఇప్పుడు ఆమెకు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాకు గానూ ఆమెను ఎంపిక చేసారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు ఆ సినిమాలో కీలక పాత్ర ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆమె కూడా అందుకు ఓకే చెప్పింది అని అంటున్నారు. 

 

మంచి ఆఫర్ కాబట్టి ఆమె ఎక్కువగా డిమాండ్ చేయలేదు అని సమాచార౦. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో ఆమె ఎన్టీఆర్ కి మరదలి గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఆమెకు కథ కూడా వినిపించారని తన పాత్ర ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా చెప్పారని అందుకే ఆమె మరో ఆలోచన లేకుండా ఈ ఆఫర్ ని ఓకే చేసింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: