సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత మంది మాట్లాడే మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆదరణ పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశాల కోసం ఏది పడితే అది మాట్లాడవచ్చు అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. అందులో హీరోయిన్ లు చేసే వ్యాఖ్యలకు మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే ఏది పడితే అది మాట్లాడటం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఒక హీరోయిన్ కూడా ఇలాగే మాట్లాడింది సోషల్ మీడియాలో. 

 

ఇటీవల ఒక ఇంటర్వ్యు ఇచ్చింది తెలుగులో అవకాశాలు రాని హీరోయిన్. ఆమె చేసిన ఆరోపణలు ఒక సీనియర్ హీరో మీద. ఆ హీరో మీద ఆమె చేసిన ఆరోపణలను కొందరు హీరో దృష్టికి తీసుకుని వెళ్ళారు. సదరు హీరో ఆమె తో మాట్లాడి ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచార౦. పద్ధతి మారకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని ఆమెను హెచ్చరించినట్టు సమాచారం. దీనితో ఆమె వెనక్కు తగ్గి ఆ ఇంటర్వ్యులో ఆ వ్యాఖ్యలను తీసేయమని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఇక ఆమె అక్కడి నుంచి నేరుగా ముంబై కూడా వెళ్లిపోయింది అని అంటున్నారు. 

 

ప్రస్తుతం తెలుగులో ఆమెకు అవకాశాలు రావడం లేదు. దీనితో హీరోయిన్ ఎక్కువగా ముంబై లో ఉండి ఏదోక అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అయినా సరే ఆమెకు అవకాశాలు అక్కడ కూడా పెద్దగా రావడం లేదని అంటున్నారు. అసలు ఆమె సినిమాలకు దూరంగా ఉండాలి అనే ఆలోచనలో ఉందని కూడా సమాచారం. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే అవకాశాలు వస్తాయి అని భావించడం కరెక్ట్ కాదని మున్ముందు అవి బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయని ఆమెకు హెచ్చరికలు వెళ్ళిన తర్వాత ఆమె వెనక్కు తగ్గి ఇక ఎవరితో మాట్లాడేది లేదు అని చెప్పినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: