ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలెంజ్ ల పర్వం కొనసాగుతోంది. కరోనా పుణ్యమా అని సినీ ప్రముఖులందరూ ఎవరి ఇళ్లలో వారు ఉంటూ సమయాన్ని గడుపుతున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి దర్శకుడు ప్రారంభించిన చాలెంజ్ పర్వం విజయవంతంగా సాగుతోంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ ప్రారంభించిన బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ ని ఇప్పటి వరకు అనేక మంది దర్శకులు, సినీ తారలు స్వీకరించి అతి తక్కువ సమయంలో ఈ ఛాలెంజ్ ను అనేక మంది చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఇందులో ముఖ్యంగా అగ్ర తారలు పాల్గొనడం విశేషం.

 

అయితే ఇందులో సెలబ్రిటీల నుండి మాత్రమే కాకుండా కొంత మంది సామాన్య ప్రజల నుంచి కూడా కొన్ని చాలెంజ్ లను స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే వారు కొత్త సవాళ్లను అంగీకరించడం వాటిని చేయడం ఆ తర్వాత వాటిని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి ఇతరులకు వాటిని సవాలు విసురుతున్నారు. అయితే ఇప్పుడు రియల్ మాన్ చాలెంజ్ తర్వాత " స్వీప్ చాలెంజ్" ను టాలీవుడ్ కళాకారులు మొదలుపెట్టారు. 


ఇక ఇందులో శ్రావణ భార్గవి, pvns రోహిత్, సత్య యామిని, అనుదీప్ దేవరకొండ, మనీషా వీర బత్తిని, వేదాల హేమచంద్ర, రావాలి దేవరకొండ ఇలా ఈ సవాళ్లను స్వీకరిస్తూ వారు తమ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. వారు చీపురు పట్టుకొని ఊడుస్తూ తమదైన శైలిలో సృజనాత్మకతను దానికి జోడించి వీడియోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చాలెంజ్ ఎక్కువగా టాలీవుడ్ సంగీతకారుల మధ్య జరుగుతుందని చెప్పవచ్చు. ఇందులో వారు పాటలు పాడుతూ చీపుర్లతో వారి ఇంటిని నీటుగా ఊడవడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: