టాలీవుడ్ లో మల్టీస్టారర్ ల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రేక్షకులు కూడా మల్టీస్టారర్ చిత్రాలను ఆదరించడం మొదలు పెట్టారు. ఇక ఎలాగో అభిమానులు ఆదరిస్తున్నారు కదా అని స్టార్ హీరోలు సైతం ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు మల్టీస్టారర్ సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ మధ్య వచ్చిన మల్టీస్టారర్ లలో చాలా వరకు సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల', ‘ఎఫ్ 2', ‘వెంకీమామ' వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే మిగిలిన హీరోలు సైతం అలాంటి సినిమాలు చేయాలని భావిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా వాటిపై దృష్టి సారిస్తున్నారు.

 

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'.  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు నాని - సుధీర్ బాబు కలిసి 'వి' సినిమాలో నటిస్తున్నారు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య'లో సైతం చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వీటితో పాటు 'లూసీఫర్' రీమేక్, ‘మహాసముద్రం', ‘ఎఫ్ 3' వంటివి పట్టాలెక్కాల్సి ఉంది. తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా నడుస్తున్న ఈ సమయంలో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకి వచ్చింది.

 

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - నేచురల్ స్టార్ నాని కలయికలో ఆ మూవీ రాబోతోందట. ఈ సినిమాకి ‘సంతోషం' ‘మిస్టర్ పర్‌ఫెక్ట్' సినిమాలు రూపొందించిన దశరథ్ దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను వాల్‌ పోస్టర్ బ్యానర్‌ పై నాని.. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌ పై పవర్ స్టార్ కలిసి నిర్మిస్తున్నారని.. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు అన్నాదమ్ముల కథతో ఈ సినిమా తెరకెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్‌ లో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుందన్న వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: