ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఒకటే మాట వినపడుతోంది.. అదే కరోనా.. లాక్ డౌన్ ను విధించి ఎంత కట్టడి చేయాలని ప్రభుత్వం చూసిన కూడా దాని ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..అయితే కరోనను ఎదుక్కోడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మాధ్యమాలా ద్వారా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అంతేకాకుండా లాక్ డౌన్ లో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు..
అయితే, ఈ కరోనా డైరెక్టర్ తేజలో ఒక కొత్త ఆలోచనను పుట్టించింది. అదే WHO ఆన్లైన్ కోర్స్. శ్వాసకోశపై ప్రభావం చూపించే కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ కోర్స్ ద్వారా తేజ నేర్చుకుంటున్నారు.ఈ కోర్సులో భాగంగా అంటువ్యాధులు, వేగంగా ప్రమాదానికి గురయ్యే శరీర భాగాలు వాటి గురించి తేజ తెలుసుకుంటున్నారు. ఈ కోర్స్ పూర్తయిన తరవాత తేజ ఆన్లైన్ టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుందట. ఈ టెస్ట్లో పాసయితే WHO వాలంటీర్గా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తారు.
ఈ కోర్సు నేర్చుకుని అంటు వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై తన చుట్టూ ఉన్న వాళ్లకు తేజ అవగాహన కల్పించనున్నారు. ఇకపోతే లాక్ డౌన్ లో ఉన్న రోజువారీ సినీ కార్మికులకు ఇండస్ట్రీలోని ప్రముఖులు సాయమందిస్తున్నారు..ఈ నేపథ్యంలో తనవంతుగా ఈ వ్యాధులపై వారికి అవగాహన కల్పించాలని తేజ చూస్తున్నారట.
తేజ సినిమాల విషయానికి వస్తే.. కిందటేడాది ఆయన ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తరవాత మరే ప్రాజెక్ట్ను తేజ ప్రకటించలేదు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, పలు హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన తేజ.. 20 ఏళ్ల క్రితం ‘చిత్రం’ సినిమా ద్వారా టాలీవుడ్కు డైరెక్టర్గా పరిచయమయ్యారు. తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో తేజ పేరు మారుమోగింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చిన తేజ ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు..