అనిల్ రావిపూడి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్లో డైరెక్టర్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి వరుస విజయాలు సొంతం చేసుకుంటూ ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడీయన. రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలవడం విశేషం. ఇక చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ డైరెక్టర్ రేంజ్కు ఎదిగాడీయన. పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టిన అనిల్ రావిపూడి ప్రేక్షకలోకాన్ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్ సినిమాలతో తన టాలెంట్ బయటపెట్టి గతేడాది ఎఫ్ 2 సినిమాతో భారీ హిట్ సాధించారు.
ఇక ఇటీవల మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరూ` సినిమాను కేవలం ఆరు నెలల్లో రూపొందించడమే కాకుండా.. సంక్రాంతి బరిలో దిగి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు. వాస్తవానికి కథాకథనాలను చకచకా సిద్ధం చేసుకోవడంలోను .. ప్రేక్షకులను నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడంలోను .. అంతే వేగంగా ఆ కథలను తెరకెక్కించడంలోను అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ప్రస్తుతం ఈయన ఎఫ్ 3 సినిమా సెట్ చేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
అది కూడా `ఆర్ఆర్ఆర్` తర్వాతే చెర్రీ, అనిల్ రావిపూడి కాంబోనేషన్ ఉండనుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ ప్రోజెక్ట్ను మహేస్ బాబు అనుకోకుండా చెడగొట్టినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి' హిట్ అందుకున్న మహేశ్ బాబు, ఆయనతో మరో సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన కుదరలేదు. కానీ, ఈ కథకు చరణ్ సెట్ అవుతాడనీ, ఆయనను ఒప్పిస్తే తాను నిర్మిస్తానని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు అన్నాడట. దీంతో చరణ్ కూడా `ఆర్ఆర్ఆర్` తర్వాత వంశీ ప్రోజెక్ట్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు టాక్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే మహేష్ అనుకోకుండా చేసిన పొరపాటుకు.. చెర్రీతో అనిల్ చేయాలని అనుకున్న సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.