ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మరొక సంస్థైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నలభై శాతానికి పైగా పూర్తి అయిందని ఇటీవల దర్శకుడు కొరటాల శివ, హీరో మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా మరొక స్టార్ హీరో ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేయనున్నట్లు కొరటాల చెప్పడం జరిగింది. 

 

అయితే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేదా సూపర్ స్టార్ మహేష్ లలో ఎవరో ఒకరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే ముందుగా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేసింది యూనిట్. ఆమెతో కొంత షూటింగ్ పూర్తి అయిన తరువాత వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన ఆ సినిమా నుండి త్రిష అర్ధాంతరంగా తప్పుకుంది. కాగా ఆ తరువాత మరొక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని త్రిష స్థానంలో తీసుకున్న యూనిట్, ఆమెతో ఇటీవల కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిందట. అయితే ఈ సినిమా నుండి కాజల్ కూడా తప్పుకుందని, ఇటీవల వార్తలు రావడం జరిగింది. 

 

ప్రస్తుతానికి కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో మిగతా సినిమా షూటింగ్స్ తో పాటు ఆచార్య షూటింగ్ కూడా వాయిదా పడిన తరువాత సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన కొరటాల శివ, మార్చిన ఆ స్క్రిప్ట్ ని కాజల్ కు చెప్పడం జరిగిందని, అయితే కొరటాల చెప్పిన దానితో ఏకీభవించని కాజల్, సినిమా నుండి తప్పుకుంటున్నట్లు తెలిపిందని సమాచారం. అయితే నేడు కొందరు ఆ సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆచార్య నుండి కాజల్ తప్పుకుంది అనే వార్తలో ఏ మాత్రం నిజం లేదని, అదంతా ఒట్టి పుకారు మాత్రమే అని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై పూర్తి వాస్తవాలు వెల్లడి కావలసి ఉంది.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: