టాలీవుడ్ రచయితైన త్రివిక్రమ్ శ్రీనివాస్, ముందుగా తరుణ్, శ్రియ ల కలయికలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో అతడు సినిమాను తీసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మొన్నటి అలవైకుంఠపురములో వరకు కెరీర్ పరంగా కొన్ని సూపర్ హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాపులు కూడా అందుకున్నారు త్రివిక్రమ్. ఇకపోతే అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్న సినిమాకి ఆయన దర్శకత్వం వహించనున్నారు. 

 

ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్టుతో మన దేశం మొత్తం కూడా కొన్నాళ్లుగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కథని  మరింత పటిష్టంగా పూర్తి చేసే పనిలో పడ్డారు త్రివిక్రమ్. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత మంచి విజయాన్ని అందుకోగా, దానిని మించేలా మరింత మంచి గొప్ప విజయాన్ని అందుకునేలా త్రివిక్రమ్ ఈ కథని సిద్ధం చేస్తున్నారట. అయితే ఇటీవల ఆయన తీసిన అలవైకుంఠపురములో మూవీ, పాటల పరంగా, అలా సినిమా పరంగా ఎంతో గొప్ప విజయం అందుకోవడంతో, తమ హీరో అయిన ఎన్టీఆర్ కాంబినేషన్లో రానున్న సినిమాని కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ సాంగ్స్ తో, అదిరిపోయే ఎంటర్టైన్మెంట్, యాక్షన్ కలయికలో తెరకెక్కించి, తమ హీరోకి కూడా గొప్ప విజయాన్ని త్రివిక్రమ్ తప్పక అందిస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి గతంలో వచ్చిన అరవింద సమేత మంచి సక్సెస్ అందున్నప్పటికీ, ఆ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం లేదని చెప్పాలి. 

 

దానితో ప్రస్తుతం వీరిద్దరి కలయికలో రానున్న ఈ రెండో సినిమాలో కమర్షియలిటీ తో పాటు, ఎంటర్టైన్మెంట్ ని కూడా మరింత ఎక్కువగా ఆశిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి వారు ఆశ పడుతున్న మాదిరిగా కాకుండా త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ లో ఏ మాత్రం కొద్దిపాటి లోపాలు ఉన్నా, రేపు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు అది రుచించకపోగా, అది పెను ప్రమాదంగా పరిణమించి సినిమాకి పెద్ద దెబ్బ వేయడంతోపాటు, త్రివిక్రమ్ కెరీర్ ని కూడా కొంత తిరగబడేలా చేసినా చేయొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమాని త్రివిక్రమ్ ఏ విధంగా తెరకెక్కిస్తారో, అలానే ఎన్టీఆర్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తారో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: