బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌కున్న క్రేజ్ ఏంటో అంద‌రికి తెలిసిందే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఓ సినిమా చేయాలంటే చాలా సెలెక్టీవ్‌గా చేస్తుంటారు ఆమీర్‌. ప్ర‌తీ క్యారెక్టర్ ప‌ర్‌ఫెక్ట్‌గా రావాల‌ని ఎంతో క‌ష్ట‌ప‌డి ప్లాన్ చేస్తుంటారు. అలాంటి మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ , `బాహుబ‌లి`తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ క‌లిసి న‌టిస్తారా?  అవునా ఇద‌స‌లు జ‌రుగుతుందా? ఒక వేళ అది కుదిరే ప‌నేనా అంటే ఓ యంగ్ డైరెక్ట‌ర్ మాత్రం అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు.

 

న‌వీన్ పొలిశెట్టి హీరోగా ప‌రిచ‌య‌మైన చిత్రం `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`. ఈ చిత్రంతో స్వ‌రూప్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సీరియ‌స్ పాయింట్ చంట‌బ్బాయి త‌ర‌హా కామెడీని జోడించి తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని ఎలాగైనా స‌రే తెర‌కెక్కించాల‌నే ప్ర‌య‌త్నాల్లో వున్నాడు. లాక్‌డౌన్ త‌రువాత ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌ని మొద‌లుపెట్ట‌బోతున్నాడ‌ట ద‌ర్శ‌కుడు స్వ‌రూప్‌.

 

మీడియా ఇంట‌రాక్ష‌న్ అయిన స్వ‌రూప్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి.. ఇటీవ‌లె ఆయ‌న తెలిపారు. ఇక ఈ  క్రేజీ ఆలోచ‌న గురించి చెప్పి షాకిచ్చాడు. త‌‌న‌కు బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌, ప్ర‌భాస్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేయాల‌ని వుంద‌ట‌. అవ‌కాశం వ‌స్తే అంతా ఆశ్చ‌ర్య‌‌ప‌డేలా ఎక్స‌ట్రార్డిన‌రీ క‌థ‌తో సినిమా చేస్తాన‌ని చెబుతున్నాడు. స్వ‌రూప్ క్రేజీ ఆలోచ‌న విన్న వారంతా అమీర్‌ఖాన్ – ప్ర‌భాస్.. మ‌ల్టీస్టార‌ర్ అయ్యే ప‌నేనా? అంటున్నారు. ఎందుకంటే వీరిద్ద‌రి తీరు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. వేర్వేరు స్టైల్స్‌లో వీళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారు. మ‌రి ఈ కాంబినేష‌న్ ఎంత వ‌ర‌కు వ‌ర్క్ అవుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. అందులోనూ ఆ స్క్రిప్ట్‌లో కామెడీని జోడించి అంటే గ‌తంలో అమీర్‌ఖాన్ అంటే కొంత కామెడీని పండించ‌గ‌ల‌డు కానీ ప్ర‌భాస్ కామెడీ చెయ్య‌గ‌ల‌డా.

మరింత సమాచారం తెలుసుకోండి: