ఒక హీరోకి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు ఆ హీరో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడికి ఉంటుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని కూడా ఏ దర్శకుడైనా అనుకుంటాడు. ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా.. అవకాశం ఎవరి రూపంలో వరిస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అందరిలాగే పూరి జగన్నాథ్ ఆశపడి చివరి నిమిషంలో భంగపడ్డాడు. `ఆటో జానీ` పేరుతో చిరుతో సినిమా చేయాలని లైన్ కూడా రెడీ చేశారు. చిరుకు వినిపించారు కూడా. అయితే రాజకీయాల్లోంచి తిరిగి వచ్చాక ఈ తరహా సినిమా చేయడం ఏంటని పూరిని పక్కన పెట్టారు చిరు.
దాంతో `ఆటోజానీ` చర్చల దశలోనే ఆగిపోయింది. ఆ తరువాత పూరి చెప్పిన కథ నచ్చలేదని, అందుకే దాన్ని పక్కన పెట్టానని మీడియా ముఖంగా వెల్లడించారు. చిరు అలా మీడియా ముఖంగా తన కథ నచ్చలేదని చెప్పడం పూరీని బాధించింది. ఎప్పటికైనా చిరు నుంచి పిలుపు రాకపోతుందా, అని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఛాన్స్ ఇస్తే ఎక్స్ట్రార్డినరీ కథని తెరపైకి తీసుకురాకపోతానా అని ఎదురుచూస్తున్నాడు. పూరిలాగే బోయపాటి శ్రీను కూడా చిరు కోసం ఎదురుచూస్తున్నాడు.
`సరైనోడు` ఫంక్షన్లో చిరు, బోయపాటిల కాంబినేషన్లో గీతా ఆర్ట్స్లో సినిమా వుంటుందని, త్వరలోనే దానికి సంబంధించిన పూర్తి వివరాల్ని వెల్లడిస్తానని అల్లు అరవింద్ మీడియా సాక్షిగా వెల్లడించారు. కానీ అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. అయినా బోయపాటి ఏమాత్రం ఈ ప్రాజెక్ట్ పై ఆశవదులుకోనట్టు కనిపిస్తోంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ప్రతి డైరెక్టర్ ప్రతి హీరో కోసం ఓ కథ రాసుకుంటాడు. ఏ హీరోను ఎలా చూపించాలో ఓ ఐడియాతో వుంటాడు. ఎటొచ్చీ ఆ టైమ్ రావాలి. అలాంటి టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా వాడుకుంటా. మెగాస్టార్తో సినిమా ఛాన్స్ వస్తే వదిలే ప్రసక్తే లేదని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు. మరి ఈ కాంబినేషన్ వర్క్ అవుతుందా. ఒకవేళ చిరు బోయపాటికి కనుక ఛాన్స్ ఇస్తే చిరుని బోయపాటి మాస్ క్యారెక్టర్లో చూపిస్తారా. ఇక ప్రస్తుతం చిరు అన్ని సోషల్ మెసేజ్ తో కూడుకున్న చిత్రాలని ఎక్కువగా చేస్తున్నారు.