యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్ లలో తనకు పోటీ వచ్చే వారే లేరని నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ  సినిమా ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈయన తెలుగు హీరో మాత్రమే.. కానీ రాజమౌళి ట్రిపుల్ ఆర్ విడుదలైన తర్వాత కచ్చితంగా ఈయన నేషనల్ స్టార్ అయిపోతాడు. రాజమౌళి సినిమా ఎఫెక్ట్ అలా ఉంటుంది మరి. బాహుబలి తర్వాత సాహోతో తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ కొట్టాడు ప్రభాస్. ప్రస్తుతం ఈయన సినిమాలకు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలలో డిమాండ్ ఉంది. అచ్చంగా జూనియర్ కూడా ఇలాంటి ప్రణాళికలే సిద్ధం చేసుకుంటున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు జూనియర్.

 

ఇప్పుడు కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈనేపథ్యంలో టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ దిగ్దర్శకుడిగా పేరున్న సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ ఓ భారీ పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఎప్పటినుండో ఆయన ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయాలని ప్రయత్నింస్తుండగా అది కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయని వినికిడి. మరో విశేషం ఏమిటంటే ఈ మూవీలో హీరో రణవీర్ సింగ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ కీలక రోల్ చేయనున్నాడట. మరి ఇదే కానుక నిజం అయితే ఎన్టీఆర్ కి ఆర్.ఆర్.ఆర్ తరువాత ఓ బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్ ఇండియా లెవెల్ కి చేరుతుందని తెలుస్తుండగా, ఈ ప్రాజెక్ట్ ఆయన ఇమేజ్ మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్న ఎన్టీఆర్ కొద్దిరోజులలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే తన 30వ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: