సింహ ,లెజెండ్ లతో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన అగ్ర హీరో బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ రామోజీ సిటీలో పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ కూడా అక్కడే జరుగనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో బాలయ్య ను కొత్తగా  చూపించనున్నాడు బోయపాటి. అందులో భాగంగా బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించనున్నాడు.
 
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త ఆమె ను తీసుకోనున్నామని ఇటీవల బోయపాటి వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కు హీరోయిన్ ను కూడా  ఫిక్స్ చేశారట. ముంబై  కు చెందిన ఓ మోడల్  బాలయ్య కు జోడిగా నటించనుంది. త్వరలోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా  సుమారు 50 కోట్ల బడ్జెట్ తో జయ జానకి నాయక నిర్మాత  మిర్యాల రవీందర్ రెడ్డి  నిర్మిస్తున్నాడు. ఈఏడాది అక్టోబర్లో సినిమా ను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 

ఇక ఈసినిమాతో అటు బాలయ్య అలాగే  బోయపాటి హిట్ కొట్టక తప్పని పరిస్థితి. గత ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు , రూలర్ తో  వరుసగా మూడు భారీ డిజాస్టర్లను చవిచూశాడు బాలకృష్ణ. ఈ సినిమాల దెబ్బ తో  ఆయన మార్కెట్ పూర్తిగా  పడిపోయింది. ఇక బోయపాటి కూడా  గత ఏడాది వినయ విధేయ రామ తో తీవ్ర స్థాయిలో  విమర్శలు ఎదుర్కున్నాడు. మరి వీరిద్దరు  ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టి కమ్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: