తెలుగులో కొత్తగా వచ్చే హీరోయిన్లకు ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తారు మన దర్శక, నిర్మాతలు. ఎక్కువగా నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్, దక్షిణాది నుంచి కేరళ రాష్ట్రాల నుంచి ఎక్కువగా హీరోయిన్లు వస్తూంటారు. కొత్తగా హీరోయిన్లు కావాలనుకునే వారికి తెలుగు సినీ పరిశ్రమ మంచి అవకాశం. అలా.. తమిళనాడు నుంచి వచ్చిన భామ నివేదా పేతురాజ్. తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. అల.. వైకుంఠపురములో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లాక్ డౌన్ తో ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈ భామ ఆన్ లైన్లో కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చింది.

 

 

‘తెలుగు సినిమాల్లో నాకు మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. చేసిన కొద్ది సినిమాలు కూడా హిట్ కావడం సంతోషంగా ఉంది. సోలో హీరోయిన్ గా అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. తనను తాను నిరూపించుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉండేది ఆయా సినిమాలతోనే. ఇప్పటి వరకూ చేసినవన్నీ సెకెండ్ హీరోయిన్ పాత్రలే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో చేస్తున్న సినిమాలో సోలో హీరోయిన్ గానే చేస్తున్నా. మంచి పాత్ర, గ్లామర్ కు అవకాశమున్న పాత్ర అయితే పాత్రకు తగ్గట్టు నటించడానికి అభ్యంతరం లేదు. అటువంటి అవకాశం కోసం చూస్తున్నాను.’ అని చెప్పుకొచ్చింది.

 

 

నివేదా పేతురాజ్ ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తో చిత్రలహరిలో నటించింది. ఈ సినిమా అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత చేసిన బ్రోచేవారెవరురా మూవీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది. అల్లు.. అర్జున్ సినిమా అల.. వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ కావడం ఈమెకు కాస్త లక్ కలిసొచ్చింది. స్కిన్ షోకు వెనుకాడనని చెప్తున్న నివేదాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో మరో గ్లామర్ హీరోయిన్ టాలీవుద్ కి దొరికినట్టే
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: